ఢిల్లీలో విద్యార్థుల నిరసనకు సోనియా గాంధీ సొంత మాటలు చెప్పారు. దోషులన్ని వదిలిపేట్టేది లేదని సోనియా గాంధీ అన్నారు. విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను వదిలిపెట్టేది లేదని, వీరిని శిక్షించేందుకు త్వరతగతిన చర్యలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్న నిరసనకారులు ఆదివారం 10 జన్పథ్ నివాసంలో సోనియా, రాహుల్తో భేటీ అయ్యారు. దాదాపు 90 నిముషాల పాటు సాగిన ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ మాట్లాడుతూ నిరసనకారులకు పై హామీ ఇచ్చారు. అయితే దోషులను ఎప్పటిలోగా శిక్షిస్తారన్న దానిపై నిర్ధిష్టమైన గడువు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆందోళనకారులు మాట్లాడుతూ, తమ నిరసన ప్రదర్శనలు ఇకముందు కూడా కొనసాగుతాయని, అయితే వీటిని శాంతియుతంగా నిర్వహించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలంటూ తాము చేసిన వాదనను సోనియా, రాహుల్ సావధానంగా ఆలకించారని, ఇందుకు సంబంధించిన చట్టాలను సవరించాలని తాము చేసిన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వానికి కొంత సమయం పడుతుందని, సాధ్యమైనంత త్వరలోనే ఈ పని పూర్తిచేస్తామని, అప్పటివరకూ ఓర్పుతో వ్యవహరించాల్సిందిగా వారు తమను కోరారని ఒక నిరసనకారుడు తెలిపాడు. మహిళలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు నిరసనకారుల ప్రతినిధులు ఈ సమావేశంలో కొన్ని సూచనలు చేశారని ఆర్.పి.ఎన్.సింగ్ విలేఖర్లకు తెలిపారు. వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని నిరసనకారులకు హామీ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఈ కేసులో బాధితురాలు కాకుండా నిందితులే తమ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలని తాము కోరుకుంటున్నట్టు నిరసనకారులు ఈ సమావేశంలో స్పష్టం చేశారని ఆయన అన్నారు. అయితే ఈ కేసులో దోషులను ఎప్పటిలోగా శిక్షిస్తారన్న దానిపై నిర్ధిష్టమైన గడువును వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. విద్యార్థులు మాత్రం వెంటనే ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more