Andhra pradesh governor e s l narasimhan

andhra pradesh governor, e s l narasimhan,kiran kumar reddy, andhra pradesh politics,andhra governor meets pm, aicc president sonia gandhi, manmohan singh, tdp, tdp leaders, cm kiran kumar reddy, congress party,

andhra pradesh governor e s l narasimhan

narasimhan.gif

Posted: 12/15/2012 10:01 AM IST
Andhra pradesh governor e s l narasimhan

andhra pradesh governor e s l narasimhan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మాత్రమే మాట్లాడానని, ముఖ్యమంత్రిపై నివేదిక ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన గవర్నర్ నరసింహన్ పలువురు పెద్దలను కలస్తూ బిజీ బిజీగా ఉన్నారు. కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయిన అనంతరం ఆయన ఒక రాష్ట్ర గవర్నర్‌గా ఏఐసీసీ పెద్దలను కలవడంలో తప్పులేదని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలను అరికట్టేందుకు యత్నిస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైల్ వ్యవహారం ఇంకా పరిశీలనలో ఉందని, దానికి కాలపరిమితి లేదని, ఆ ఫైల్‌ను ఇంతవరకు చూడలేదని, రెండు, మూడు నెలల్లో దానిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని గవర్నర్ పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దలను కలవటంలో ఎలాంటి ప్రత్యేకత లేదని చెప్పారు. ఏఐసీసీ పెద్దలను కలిసినప్పుడు ఈనెల 28న జరగనున్న అఖిలపక్షంపై చర్చించలేదని నరసింహన్ తెలిపారు. అఖిలపక్షంపై హోంమంత్రే సమాధానం చెబుతారని అన్నారు. అనంతరం గవర్నర్ ప్రదానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై సుమారు 20 నిముషాలపాటు మాట్లాడినట్లు సమాచారం.

andhra pradesh governor e s l narasimhan

 ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పనితీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తాను ఎలాంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ స్పష్టం చేశారు. అయితే సోనియాగాంధీకి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించటం మాత్రం నిజమేనని ఆయన అంగీకరించారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారంటూ తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శల గురించి అడుగగా పదవిలో ఉన్నప్పుడు విమర్శలు రావటం సహజమేనన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయాలు చేయటం ఏమిటనే విమర్శకు బదులిస్తూ రాజ్యాంగం పరిధిలోనికి రాని రాజకీయాలేమైనా ఉంటాయా? అని నరసింహన్ అడిగారు. ఒక రాష్ట్ర గవర్నర్‌గా అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కలుసుకుని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించటం, చర్చించటంలో ఎలాంటి తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులను కలుసుకుని చర్చించటంపై వస్తున్న విమర్శలను తాను ఎంత మాత్రం పట్టించుకోనని నరసింహన్ తేల్చిచెప్పారు. రాజ్యాంగం, రాజకీయం వేరుకాదని గవర్నర్ వాదించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prime minister silvio berlusconi love affair
26 killed including 20 children in newtown  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more