గుజరాత్ ఎన్నికల ప్రచారం హాట్ హాట్ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొవటానికి గుజరాత్ ముఖ్యమంత్రి ఒక్కరే ప్రచార రంగంలోకి దిగాడు. బాజాపా తరుపున నరేంద్ర మోడీ ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. ఆయన ఒక్కడి స్వరమే కాంగ్రెస్ నాయకులపై హాట్ హాట్ విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధి గుజరాత్లో తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రాహుల్ తమ ప్రచారంలో ఒకవైపు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేస్తూ మరోవైపు మహాత్మా గాంధీజీయే తనకు ఆదర్శం అని చెప్పారు. గుజరాత్లో మోడీ తాను ఏదో సాధించానని చెప్పుకుంటున్నారని, మోడీ ఒక గొప్ప మార్కెటింగ్ మనిషి అని ఆయన విమర్శించారు. మోడీ పాలనలో లోకాయుక్త లేదని, సమాచార హక్కుకు గుజరాత్లో చిరునామా లేదని, దాదాపు 14 వేల దరఖాస్తులు గుజరాత్లో మూలన పడి ఉన్నాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.
మోడీ తన రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందుతున్నదని చెబుతూన్నా కొన్ని చోట్ల మూడు రోజులకు ఒకసారి మాత్రమే మంచినీళ్లు సరఫరా అవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని రాహుల్ వెల్లడించారు. మోడీ తన ఒక్కడి స్వరమే వినిపిస్తారు గాని ప్రజల స్వరం విననివ్వరని రాహుల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మోడీకి కావలసింది ఆయన మాట అందరూ వినడం మాత్రమే గాని మీ మాట వినిపించుకోవాలని ఆయన అనుకోరని, నిజమైన నాయకుడు ప్రజల గొంతు విని అందుకు అనుగుణంగా నడుచుకుంటాడని, కాని మోడీ గాని, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వ విధానం గాని అది కాదని ఆయన నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రంలో ఇది (గుజరాత్) బాపూజీ పుట్టిన గడ్డ. బాపూజీ విశ్వసించిన రాజకీయాలకు ఇంకా ప్రాసంగికత ఉందా అని కొంతమందికి అనుమానం కలుగవచ్చునంటూ తనకు మాత్రం ఎప్పుడూ గాంధీజీయే ఆదర్శమని, గాంధీని తాను ఒక గురువుగా భావిస్తానని ఆయన చెప్పారు. గాంధీజీ గాని, నెహ్రూజీ గాని ప్రజల గొంతు వినాలని చెప్పేవారని, తానూ అదే బాటలో నడుస్తానని ఆయన చెప్పారు, మోడీ ప్రభుత్వం అవినీతిని దాచిపెడుతోందని, అవినీతి పరులను కాపాడుతోందని రాహుల్ ధ్వజమెత్తారు.యుపీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అయినా పేదల కష్టాలను మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గుజరాత్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ఈనెల 13వ తేదీన జరుగనుంది. రెండో దశ పోలింగ్ 17వ తేదీన, ఓట్ల లెక్కింపు 20వ తేదీన నిర్వహిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more