ఫిలింనగర్ లో వినిపిస్తున్న పుకార్లు త్వరలో నిజ రూపం దాల్చుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై అనేక పుకార్లువచ్చాయి. ఆయన త్వరలో ఒక రాజకీయ పార్టీలో చేరుతున్నాడనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. పూరీ ఆ పార్టీ అధినేతతో కొన్ని రోజుల నుండి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత కోసమే టాలీవుడ్ లో రెండు సినిమాలకు దర్శకత్వం చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. పూరీ తో పాటు ఆయన భార్య లావణ్య, ఆయన తమ్ముడు ఉమాశంకర్ గణేశ్ లు ఆ పార్టీలో చేరుతున్నట్లు ఒక దినపత్రిక రాయటం జరిగింది. అయితే గెలుపుగుర్రాల వేటలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ నుండి పూరీ కుటుంబానికి ఆహ్వానం పలికింది. పూరీ కుటుంబానికి విశాఖజిల్లా అనకాపల్లి లోక్ సభ లేదా నర్సీ పట్నం అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట పూరీ కుటుంబానికి ఇచ్చే యోచన ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ పార్టీలో అంత చరిష్మా ఉన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో కొత్త అభ్యర్థుల కోసం వేట సాగిస్తున్నారు. ఇక్కడ పూరీ కుటుంబం పై జగన్ పార్టీ ఎందుకు ఎంచుకుంది అంటే ? ఇక్కడ ఒక రాజకీయం ఉపయోగించాడు జగన్. దర్శకుడు పూరీ భార్య లావణ్య కాపు వర్గానికి చెందిన వారు కావడంతో ఆమెను రంగంలోకి దించితే బాగుంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పూరీ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ టీడీపీలో కొటవురట్ల మండలశాఖ అధ్యక్షునిగా పని చేశారు. తర్వాతి కాలంలో ఆయన టీడీపీ నుంచి బయటకొచచి జగన్ పార్టీలో చేరారు. అంతేకాకుండా జగన్ తల్లి, వైఎస్ విజయలక్ష్మి , ఆమె కుమార్తె షర్మిల ఒక రోజు పూరీ ఇంట్లో భోజనం కూడా చేశారు. గతంలో హైదరాబాద్ లో జరిగిన పూరీ జగన్నాథ్ కుమార్తె ఓణీల ఉత్సవానికి జగన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూరీ సోదరుడు గణేశ్ కి నర్సీపట్నం అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే అతని విజయానికి క్రుషి చేస్తానని పూరీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more