12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అది ప్రజలు కూడా మరిచిపోయి తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సంఘటన పై సిఐడీ విచారణ మొదలు పెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాయంలో.. బషిర్ బాగ్ ఘటనలో బుల్లెట్ కొంత మందిని బలితీసుకుంది. ఇది హైదరాబాద్ నడిబోడ్డున్న జరిగిన విషయం. ఆ రక్త చరిత్రను ఇప్పుడు తెరపైకి వచ్చింది. అప్పట్లో విద్యుత్ చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు అసెంబ్లీ ముట్టడి చేసే సందర్భంలో హింసాత్మకంగా మారి రక్త చరిత్రగా మిలిగిపోయింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం లో జరిగిన ఘటనకు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీషీట్ దాఖలకు సీఐడీ సిద్దం అవుతుంది. బషిర్ బాగ్ సంఘటనలో అసలు బాధ్యులుగా భావించి లెఫ్ట్ నేతలు సురవరం సుధాకర్రెడ్డి ( ప్రస్తుతం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి), బీవీ రాఘవులు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి), పుణ్యవతి (రాఘవులు సహచరి, ఐద్వా జాతీయ నాయకురాలు), గుమ్మడి నర్సయ్య (సీపీఐ(ఎమ్-ఎల్) మాజీ ఎమ్మెల్యే), మానం ఆంజనేయులు (న్యూడెమోక్రసీ), కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి ( ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శి) తదితర 28 మందిపై కేసులు నమోదు చేసే దిశగా సీఐడీ అడుగులు వేస్తోంది.
చార్జిషీట్లో ఏమున్నదంటే..: రాష్ట్ర ప్రభుత్వం 2000లో విద్యుత్ బిల్లులు పెంచినందుకు నిరసనగా వామపక్ష నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. బషీర్బాగ్ వద్ద ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేసేందుకు పోలీసులు అనుమతిచ్చారు. కానీ, ఆ రోజు బషీర్బాగ్ వద్దకు చేరుకున్న వామపక్ష, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బారికేడ్లు దాటుకొని అసెంబ్లీ వైపు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు.అంతేగాక ఓ కానిస్టేబుల్ చేతిలో తుపాకీ లాక్కొని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఫలితంగా ఖైసర్ అనే హెడ్ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా వేలమంది ఒక్కసారిగా రాళ్లతో దాడి చేయడంతో 119 మంది పోలీసులు గాయపడ్డారు. మరోవైపు 20 వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు. దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు.
దీంతోమొదట బాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఇక పరిస్థితి చేజారిపోతున్నదనుకున్న సమయంలో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బషీర్బాగ్ వద్ద బాలస్వామి, ఆంజనేయులు, జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద సత్తెనపల్లి రామకృష్ణ తూటా గాయాలతో మరణించారు. మొత్తం ఘటనలో ఇప్పటివరకూ 150మందిని గుర్తించాం. అందులో 28 మందిని మొదటి చార్జిషీట్లో నిందితులుగా చూపుతున్నాం. దర్యాప్తు కొనసాగుతోంది.రెండేళ్లుగా చురుగ్గా దర్యాప్తు: ఆందోళనకారులపై కేసులు ఎత్తివేసి కాల్పులు జరిపిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని హక్కుల సంఘాలు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించాయి. పదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం 2010 జూన్ 7న హైకోర్టు స్టే వెకేట్ చేయడంతో సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది.
సీపీఐ నేత సురవరం సుధాకర్రెడ్డి, న్యూడెమోక్రసీ నేతలు గుమ్మడి నర్సయ్య, మానం ఆంజనేయులు సహా 22 మందిపై సీఐడీ నేరాభియోగం మోపింది.బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద జరిగిన సంఘటనలో బీవీ రాఘవులు, పుణ్యవతి, సురవరం సుధాకర్రెడ్డి, సత్తెనపల్లి రామకృష్ణ(కాల్పుల్లో మరణించారు) సహా ఆరుగురిపై వేరేగా చార్జిషీట్ సిద్ధం చేసింది. సుమారు వెయ్యిమందికి పైగా నిందితులున్నారని, అయితే ఇప్పటికి రెండు కేసుల్లో 28మంది పోనూ మరో 150 మందిపై త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని సీఐడీ వర్గాలు తెలిపాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more