రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది జంప్ జిలానీల హడవుడి ఎక్కువగా కనిపిస్తుంది. జంప్ చేసే రాజకీయ నాయకుల్లో అలజడి మొదలైంది. 2014 లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియక తికమకపడుతున్నారు. అందుకోసం పదవి ఉన్నప్పుడు పార్టీ మారాలి అనే ఆలోచనలో రాజకీయ నాయకులు ఉన్నారని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. అందుకోసం కాసులు కురిపించే పార్టీలోకి వెళ్లటానికి జంప్ జిలానీలు రాజకీయ నాయకులు ఆశక్తి చూపుతున్నారు. అంతేకాకుండ ఇలాంటి నాయకులు కోసం ‘ఆకర్షణ పధకం’ అనే పేరు బాగా ఉపయోగపడుతుందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ పధకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రొత్సహిస్తునట్లు తెలుస్తోంది. జంప్ జిలానీలకు ఆకర్షణ పధకంతో మరింత లాభపడుతున్నట్లు టీడీపీ నాయకులు అంటున్నారు. పలువురు నేతలు వైసిపిలో చేరుతున్న నైపధ్యంలో కాంగ్రెస్ పార్టీ , టీడీపీ నాయకులు ఇలా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. . ఇప్పటికే విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు.. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో విజయమ్మ సమక్షంలో వైసీపీలో చేరిన విషయ తెలిసిందే. ఇక పశ్చిమగోదావరి జిల్లా అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రాజేశ్ కూడా ఇవాళో రేపో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇదే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వనిత, మాజీ ఎమ్మేల్య కృష్ణబాబు వచ్చే నెల 4న కొవ్వూరులో జరిగే బహిరంగ సభలో విజయమ్మ సమక్షంలో పార్టీలోకి చేరేందుకు సన్నద్ధం అయ్యారు. అటు నల్లగొండ జిల్లా భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, ఆయన కుమారుడు శరత్ చంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే వైఎస్ పార్టీలోకి వలసలు పెరిగిపోవటంతో ఆ పార్టీ నాయకులు ఆనందంలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇలా వచ్చే నాయకులకు ఆకర్షణ పధకం ద్వారా ఒక్కొక్కరికి బాగానే కాసులు ముట్టినట్లు , టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగానే అంటున్నారు. అయితే ఈ మాటలను జంప్ జిలానీలు లెక్కచేయకుండా జగన్ పార్టీలోకి అడుగులు వేయటం పై రాష్ట్రంలో కొత్త రాజకీయ అలజడి మొదలైందని ప్రజలు అనుకుంటున్నారు. వరదలతో రాష్ట్ర ప్రజలు బాధపడుతుంటే .. వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాత్రం అసంత్రుప్తి నాయకులకు గాలం వేసి తన పార్టీలోకి చేర్చుకుంటుందని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more