అనుకున్న విధంగానే షర్మిల పాదయాత్ర భారీగా సభా ఏర్పాట్ల మద్య షర్మిల పాదయాత్రను ప్రారంభించింది. వైఎస్ విజయమ్మ భారీ సభలో ఉద్వేకంగాం మాట్లాడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. నా కొడుకు జైల్లో ఉన్నాడు.. నా కూతుర్ని మీ ముందుకు పంపిస్తున్నాను అని విజయమ్మ కన్నీళ్లుతో చెప్పినట్లు తెలుస్తోంది. షర్మిలా మాట్లాడుతూ రాజన్న కూతురిగా..... జగనన్న చెల్లెలిగా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నానని షర్మిల తెలిపారు. తాను జగనన్న వదిలిన బాణాన్ని అని.... అందరూ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ మరో ప్రజా ప్రస్థానానికి రెండే ప్రధాన అంశాలని ....ఒకటి అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, రెండోది అసమర్థ ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబును నిలదీయటమే లక్ష్యమన్నారు. జగనన్న నాయకత్వంతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని ఆమె అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా తాను నల్లబ్యాడ్జి పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఆమె కోరారు.
చీకట్లో చిదంబరంతో రహస్య ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబునాయుడు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ సోదరి షర్మిల ఆరోపించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ముందుగా ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడేళ్లుగా ప్రధాన ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలు సమస్యలతో అల్లాడిపోతుంటే ప్రతిపక్షం చోద్యం చూస్తోందన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధంపై బాబు ప్రజలను మోసం చేశారని షర్మిల మండిపడ్డారు.విద్యుత్ బిల్లులు చెల్లించలేని రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టించారన్నారు. అవమాన భారంతో వందలమంది ఆత్మహత్యలు చేసుకున్నారని.... ఆపాపం చంద్రబాబుది కాదా అని షర్మిల ప్రశ్నించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తప్పా మూడో పార్టీ ఉండకూడదని కుట్ర పన్నుతున్నారని, జగన్ ప్రజల మధ్య ఉంటున్నారనే జైల్లో పెట్టించారని షర్మిల అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more