ఒకవైపు కరడుగట్టిన హిందూత్వవాది.. సత్పరిపాలనతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న బీజేపీ నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి. ఇంకోవైపు లౌకికత్వానికి చిహ్నం.. దేశ ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్. సహజంగా వీరిద్దరిలో ఆర్ఎస్ఎస్ మద్దతు నిస్సందేహంగా.. మోడికే ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, ఆర్ఎస్ఎస్ ఓటు మాత్రం నితీశ్కే పడింది. బీహార్ అభివృద్ధి నమూనా గుజరాత్ కంటే ఉత్తమమైనదని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఉత్తమ పాలన విషయంలో రాష్ట్రాలకు రేటింగ్ ఇస్తూ.. ఆయనీ విషయాన్ని చెప్పారు.
ప్రజాభిప్రాయం ప్రకారం.. ప్రభావవంతమైన పాలనలో గుజరాత్ కంటే బీహారే ముందంజలో ఉందని భగవత్ అన్నారు. "అభివృద్ధి పనుల్లో గుజరాత్ నమూనాను, మోడీ పనితీరును ప్రజలు ప్రశంసిస్తుంటారు. కానీ, ఈ విషయంలో నితీశ్ మోడీని సవాల్ చేశారు. బీహార్లో అభివృద్ధికి అవకాశాలు కష్టతరంగా ఉన్నప్పటికీ నితీశ్ సమర్థవంతంగా తన పాత్రను నిర్వర్తించారు'' అని భగవత్ వివరించారు. బీహార్ మోడల్ గుజరాత్ మోడల్ కంటే ఉత్తమం అని మరోసారి పునరుద్ఘాటించారు. ఇప్పటికే మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నితీశ్ కూడా సమయం చిక్కినప్పుడల్లా మోడీపై లౌకిక వాది కాదంటూ విరుచుకుపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more