సాక్షి టివిలో తెలుగుదేశం పార్టీ అధినేత పై అనేక అభియోగాలు మోపి రచ్చ రచ్చ చేసిన కోలా కృష్ణమోహన్ పోలీసులకు చిక్కెడు. హైదరాబాద్లో అరెస్టయిన యూరో లాటరీతోపాటు పలు చీటింగ్ కేసుల్లో నిందితుడు కోలా కృష్ణమోహన్ను విజయవాడ పోలీసులు సోమవారం కోర్టుకు హాజరుపర్చారు. 8వ ఫాస్టు ట్రాక్కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీలక్ష్మి ఆయనకు రిమాండ్ విధించారు. తిరిగి 8వ తేదీన కోర్టులో హాజరుపర్చాల్సిందిగా ఆదేశించారు. దీంతో కోలాను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. పటమట, గవర్నరుపేట తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు చెల్లనిచెక్కులు ఇచ్చి కోలా కృష్ణమోహన్ టోకరా ఇచ్చారు. ఈ కేసుల్లో ఆయనకు కింది కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీనిపై కోలా చేసుకున్న అప్పీల్ 8వ ఫాస్టుట్రాక్ కోర్టులో పెండింగ్లో ఉంది.
అయితే 2009 నుంచి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా కోలా తప్పించుకొని తిరుగుతున్నాడు. కాగా కొద్దిరోజుల క్రితం అకస్మాత్తుగా ఓ టీవీ చానల్లో ప్రత్యక్షమై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చానంటూ ప్రకటన చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎట్టకేలకు కోలా కృష్ణమోహన్ను హైదరాబాద్లో ఆదివారం అదుపులోకి తీసుకొన్నారు. విజయవాడ కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించారు. విలేకరుల కంటపడనీయకుండా పోలీసులు.. కోలాకు ముసుగుకప్పి కోర్టుకు తీసుకొచ్చారు. ఆటోలో పలు రోడ్లలో తిప్పుతూ.. జిల్లా జైలుకు తరలించడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more