వికీలీక్స్ తాజాగా అమెరికా నెత్తిన మరో బాంబు వేసింది. అగ్రరాజ్యాన్ని వణికించిన ఉగ్రనేత లాడెన్ ని అమెరికా చంపి సంబరాలు చేసుకుంది. తరువాత అతని డెడ్ బాడీని అరేబియా సముద్రంలో పడేశామని చెప్పి చేతులు దులుపుకుంది. అయితే తాజాగా వెల్లడైన కథనాల ప్రకారం లాడెన్ డెడ్ బాడీని అమెరికా ఇస్లామిక్ సాంప్రదాయల ప్రకారం ఖననం చేయకుండా దహనం చేసిందా ? అంటే అవుననే పచ్చి నిజాల్ని వికీలీక్స్ లీక్ చేసింది. ఈ వార్త ఇప్పుడు పెద్ద సంచలనాన్నే కలిగిస్తుంది.
అబోత్తాబాద్లోని ఓ భవనంలో దాగి ఉన్నలాడెన్ను గత ఏడాది మే2న అమెరికా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. లాడెన్ మృతదేహాన్ని యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ అనే నౌక ద్వారా తరలించామని... ఇస్లాం సంప్రదాయాల ప్రకారం సముద్రంలో ఖననం చేశామని అమెరికా రక్షణ వర్గాలు ప్రకటించాయి. దీనికి సంబంధించిన చిత్రాలను ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఓ హ్యాకింగ్ బృందం స్ట్రాట్ఫర్కు చెందిన ఈ-మెయిల్స్ను హ్యాక్ చేయడంతో.. అందులో లాడెన్ అంత్యక్రియలకు సంబంధించిన మెయిల్స్ బయటపడ్డాయి. స్ట్రాట్ఫర్ ఇంటెలిజెన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఫ్రెడ్ బర్టన్ పంపిన మెయిల్లో... "లాడెన్ను సముద్రంలో ఖననం చేయలేదు. ఆయన మృతదేహాన్ని సీఐఏకు చెందిన విమానంలో అమెరికాలోని డెలావేర్కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి మేరీల్యాండ్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పథాలజీకి తీసుకువెళ్లారు. బహుశా... లాడెన్ మృతదేహాన్ని గుర్తుతెలియని ప్రదేశంలో దహనం చేసి ఉండొచ్చు'' అని సందేహం వ్యక్తం చేశారు. తమ సంస్థ నుంచి కొన్ని మెయిల్స్ను హ్యాకర్లు దొంగిలించారని స్ట్రాట్ఫర్ ఒక ప్రకటనలో పేర్కొంది. వాటిలో కొన్ని నిజమైనవని.. కొన్ని ఫోర్జరీ మెయిల్స్ కూడా ఉన్నాయని పేర్కొంది. మరి ఇందులో నిజమెంతో అబ్దమెంతో అమెరికాకే తెలియాలి.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more