వచ్చే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే విషయమై మంత్రి ముఖేష్గౌడ్, స్థానిక ఎంపీ అంజన్కుమార్యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరికొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. తాను సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంపీగా పోటీ చేసి తీరతానని ముఖేష్ తేల్చిచెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని అన్నారు. ఎవరేం చేస్తారో చూస్తానని అంజన్కు పరోక్షంగా సవాల్ విసిరారు. ‘సికింద్రాబాద్ నీ జాగీరా?. ఇక్కడ కన్నేస్తే తడాఖా చూపిస్తా’ అని అంజన్.. ముఖేష్ను హెచ్చరించగా ముఖేష్ కూడా అదే ప్రశ్నను అంజన్కు సంధించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీపై తీవ్రంగా మండిపడ్డారు. ‘సికింద్రాబాద్ నీ జాగీరు కాదు. నా జాగీరు కాదు. అది ప్రజల జాగీరు’ అని చెప్పారు. అధిష్ఠానం అనుమతితో వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more