విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాల్గవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ ఐదో తేదీ వరకు కొనసాగుతాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది.
తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దేవీ భక్తులను అనుగ్రహించగా, రెండవ రోజూన బాలత్రిపుర సుందరి అవతారంలో భక్తులను అనుగ్రహించారు. ఇక మూడవ రోజున కనకదుర్గమ్మ గాయత్రీ దేవిగా దర్శనమివ్వగా.. నాల్గవ రోజున శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నారు. శరన్నవరాత్రులలో నాల్గవ రోజు అమ్మ అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తున్నారు. సకల చరాచర సృష్టిలోని జీవరాశులన్నింటికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. ఆహారంతోనే జీవరాశులు మనుగడ సాగిస్తాయని, ఆ ఆహార స్వరూపమే శక్తి అని అర్థం.
అసలు అన్నపూర్ణాదేవిని కొలిస్తే ఎప్పుడు ఆహారానికి ఇబ్బంది ఉండదని అమ్మను కొలిచిన వారి గృహం సౌభాగ్యం తో వర్ధిల్లుతుందని పెద్దల నానుడి. ఆశ్వయుజ శుద్ధ చవితి, గురువారము నాడు శరన్నవరాత్రి మహోత్సవముల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మవారు అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు. పాత్రలో ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము! పుణ్య ప్రదాయకము.
ఈ నిత్యాన్నదానేశ్వరి అలంకారంలోని శ్రీ దుర్గమ్మని దర్శించడం వలన అన్నాదులకు లోటురాదని భక్తుల విశ్వాసం. అంతేకాదు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు. ఒకసారి కైలాసంలో శివుడు ప్రపంచం మొత్తం ఆహారంతో సహా మాయ అని వ్యాఖ్యానించడంతో పార్వతిదేవికి కోపం వచ్చింది. భూమిపై ఉన్న మొత్తం ఆహారాన్ని అదృశ్యం చేసింది. దీంతో లోకంలోని అన్ని జీవాలు ఆకలితో బాధపడటం ప్రారంభించాయి. శివుడు చివరకు పార్వతి వద్దకు వచ్చి ఆహారం ప్రాముఖ్యత తెలిసిందని, భవతి బిక్షాందేహీ అని అడిగాడు. దీంతో సంతోషించి, శివునికి తన చేతులతో ఆహారాన్ని సమర్పించింది పార్వతి. శ్రీ అన్నపూర్ణ దేవికీ గంధపురంగు లేదా పసుపు రంగు చీరతో అలంకరించి - దద్దోజనం, క్షీరాన్నం , అల్లం గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more