బీజేపీ పాలిత మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఎంపీ ఓవరాక్షన్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలో ప్రవేశపెట్టిన స్వచ్చా భారత్ మిషన్ ను తప్పుగా అర్థం చేసుకున్న మనం పార్లమెంటు సభ్యుడు.. అపరిశుభ్రత - అనారోగ్యం అనే అంశాన్ని రేపటి పౌరులకు చాటుతూ సందేశాన్ని ఇచ్చాడు. దేశంలో స్వచ్చా భారత్ అంటే ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని, చెప్పడంతో పాటు పరిశ్రుభతతో కూడిన వాతావరణాన్ని దేశమంతా వ్యాపించజేయాలన్న ఉద్దేశ్యాన్ని మధ్యప్రదేశ్ ఎంపీ మార్చేశారు. పాఠశాలలోని మరుగుదోడ్లను ఒట్టి చేతులతో శుభ్రం చేశారు.
మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లా చక్దేవ్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం.. గత మంగళవారం తమ పాఠశాలలో ఐదవ, ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థినుల చేత మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. ఈ విషయం స్థానికుల కంటపడటంతో వారు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి కాస్తా వైరల్ కావడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై విచారణ జరిపించి ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా నెట్టింట్లో వినిపించాయి. అదే సమయంలో రేవా జిల్లాలో కూడా ఇటీవల ఇలాంటి సంఘటన జరిగింది.
ఈ నేపథ్యంలో రేవా బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా తాజాగా పాఠశాల వద్దకు చేరుకుని ఓవరాక్షన్ చేశారు. బీజేపి పార్టీ నిర్వహిస్తున్న ‘సేవా పఖ్వాడ’ కార్యక్రమంలో భాగంగా ఖత్ఖారీలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అక్కడ మొక్కలు నాటిన అనంతరం అపరిశుభ్రంగా ఉన్న స్కూల్ మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో క్లీన్ చేశారు. అంతేగాక ఈ వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర పార్టీ నేతలకు దీనిని ట్యాగ్ చేశారు.
మరోవైపు తానోకటి తలిస్తే.. దైవం మరోకటి తలచిందని.. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. స్వచ్ఛాభారత్ అర్థాన్ని మార్చి.. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు అనారోగ్యం, అపరిశుభ్రతను నేర్పిన ఎంపీ అంటూ కామెంట్లు వచ్చాయి. దీనికి తోడు ఒట్టి చేతులతో స్కూల్ టాయిలెట్ను క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఓవరాక్షన్పై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ స్టంట్ అని, స్కూల్ పిల్లలతో టాయిలెట్ క్లీనింగ్ను కప్పిపుచ్చేందుకు ఆయన ఇలా చేశారంటూ పలువురు విమర్శించారు.
पार्टी द्वारा चलाये जा रहे सेवा पखवाड़ा के तहत युवा मोर्चा के द्वारा बालिका विद्यालय खटखरी में वृक्षारोपण कार्यक्रम के उपरांत विद्यालय के शौचालय की सफाई की।@narendramodi @JPNadda @blsanthosh @ChouhanShivraj @vdsharmabjp @HitanandSharma pic.twitter.com/138VDOT0n0
— Janardan Mishra (@Janardan_BJP) September 22, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more