టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాట్స్ మెన్లను తన స్పిన్ బంతులతో వెనక్కి పంపించడం తెలిసిందే. అయితే ఆయన అప్పుడప్పుడూ అవేశాలకు కూడా త్వరగానే లోనవుతుంటారన్న విషయం కూడా తెలిసిందే. అస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఆండ్రూ సైమండ్స్ స్లెడ్జింగ్ తో ఆయనకు ఏర్పడిన వైరం.. ఎక్కడి వరకు దారి తీసిందో కూడా క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. అయితే అవేశం ఎక్కువన్న విషయాన్ని పక్కనబెడితే.. మనస్సుకు తాకిన విషయాలపై కూడా ఆయన అంతే త్వరగా స్పందిస్తారన్న విషయం తాజాగా జరిగింది. అయితే ఏ విషయాన్ని అంత సులువుగా వదలని ఆయన వాటిలో పరిష్కారం లభించేవరకు పోరాడుతుంటారు.
తాజాగా అదే జరిగింది. మొన్నటివరకు కేవలం క్రికెటర్ మాత్రమే ఆయిన ఆయన ఇటీవలే పార్లమెంటు సభ్యుడు కూడా అయిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను ఏకంగా రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను ఆయన పరిష్కరించడంలోనూ ముందున్నారు. ఈ క్రమంలో ఆయన తన మంచి మనసు చాటుకున్నారు. మోసగాళ్ల మాయమాటలు నమ్మి ఏడాది దేశానికి కుటుంబపోషణ కోసం బయలుదేరి వెళ్లిన ఓ నిరుపేద యువతికి వెట్టి నుంచి వారి వేతల నుంచి విముక్తి కల్పించారు.
మోసగాళ్ల బారినపడి గల్ఫ్లో చిక్కుకుపోయిన నిరుపేద యువతిని క్షేమంగా ఇంటికి చేరుకుంది. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్లోని బఠిండా జిల్లా బార్కండి గ్రామానికి చెందిన సికందర్సింగ్ దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు కాగా, పెద్దమ్మాయి కమల్జీత్ కౌర్ (21) తమ కోసం తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయింది. కుటుంబానికి ఆసరాగా నిలవాలన్న ఉద్దేశంతో స్థానిక ఏజెంటును ఆశ్రయించింది. అక్కడ ఓ భారతీయ కుటుంబంలో పనికి కుదుర్చుతామని చెప్పి ఆమెను గత నెలాఖరులో ఒమన్ రాజధాని మస్కట్ పంపించాడు.
అక్కడి విమానాశ్రయంలో ఓ ఏజెంట్ ఆమెను కలిసి నేరుగా ఫలజ్ అల్ ఖబైల్ అనే ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడకు చేరగానే కమల్జీత్ పాస్పోర్టు, సిమ్కార్డు లాక్కున్నారు. అక్కడ మరో 20 మంది వరకు భారతీయ మహిళలు ఉన్నట్టు కమల్జీత్ తెలిపింది. అక్కడ ఆమె నుంచి పాస్పోర్ట్, సిమ్కార్డ్ లాక్కున్న వారు కమల్జీత్తో బలవంతంగా బురఖా తొడిగించారు. ఆపై అరబిక్ భాష నేర్చుకోవాలని ఆదేశించారు. దీంతో తాను మోసపోయినట్టు గుర్తించిన కమల్జీత్ ఎలాగోలా కొత్త సిమ్కార్డ్ సంపాదించి తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఈ విషయం తెలిసిన అక్కడున్న వారు ఆమెను కర్రతో చితకబాదారు.
మరోవైపు, గల్ఫ్లో చిక్కుల్లో పడిన కుమార్తెను వెనక్కి రప్పించుకునేందుకు తండ్రి సికందర్ ఇంటిని తాకట్టుపెట్టి స్థానిక ఏజెంట్కు రూ. 2.5 లక్షలు ఇచ్చాడు. విషయం తెలిసిన రాజ్యసభ సభ్యుడు, మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ ఒమన్లోని భారత దౌత్య కార్యాలయ సిబ్బందితో మాట్లాడి కమల్జీత్ కౌర్ను రక్షించాల్సిందిగా కోరారు. వారు వెంటనే స్పందించి కమల్జీత్ను రక్షించారు. ఈ నెల 3న ఆమె మస్కట్ నుంచి ఇండియా చేరుకుంది. అక్కడ తనలానే ఎంతోమంది భారతీయ యువతులు చిక్కుకుపోయారని, వారందరినీ రక్షించాలని కమల్జీత్ ప్రభుత్వాన్ని కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more