అంతరిక్షంలో గ్రహ శకలాల (ఆస్టరాయిడ్స్) ప్రయాణం సాధారణమే. అయితే ఆస్టరాయిడ్స్ నుంచి భూమికి ముప్పు ముంచుకువస్తోందా? అంటే అవుననే అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా. కాగా భూమి వైపునకు కొన్ని శకలాలు దూసుకురావడం కూడా సహజమే. అరుదైన సందర్భాల్లో మాత్రమే అవి భూమిని ఢీ కొన్నాయి. చిన్న పరిమాణంలో ఉన్న శకలాలు భూవాతావరణంలోనే అంతమవుతాయి. రానున్న ఐదు రోజుల్లో కనీసం ఐదు గ్రహ శకలాలు భూమి వైపు దూసుకురానున్నాయని తాజాగా హెచ్చరించింది.
రానున్న ఐదు రోజుల్లో.. ఐదు గ్రహశకలాల్లో మూడు భారీ పరిమాణంలో ఉన్న అస్టరాయిడ్స్ భూమిపైకి దూసుకువస్తున్నాయి. అవి దాదాపు పెద్ద సైజు విమానం అంత ఉన్నాయని నాసా వెల్లడించింది. వీటిలో అతి పెద్ద గ్రహ శకలానికి 2022 OT1 అని పేరు పెట్టారు. ఇది 110 అడుగుల వెడల్పు ఉంది. ఇది ఆగస్ట్ 14 ఆదివారం తెల్లవారుజామున సెకనుకు 5.7కిమీల వేగంతో భూమి నుంచి 4.7 మిలియన్ కిమీల దూరం నుంచి దూసుకువెళ్లనుంది. ఒకవేళ ఈ గ్రహ శకలం భూమిని ఢీ కొంటే ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరమంత పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. అయితే, ఈ గ్రహ శకలాల వల్ల భూమికి తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని నాసా తెలిపింది.
భూమికి దగ్గరగా వచ్చే మరో గ్రహశకలం 2022 పీకే1. ఇది దాదాపు 100 అడుగుల వెడల్పు ఉంది. ఇది భూమి నుంచి 5.2 కిమీల దూరంలో ఉండగా మన గ్రహాన్ని దాటనుంది. మిగతా గ్రహశకలాల్లో.. 2015 ఎఫ్ఎఫ్ 53 అడుగులు, 2022 జీరోఏ4 71 అడుగులు, 2022 పిడబ్యూ 93 అడుగుల వెడల్పు ఉన్నాయి. వీటిలో 2022 పిడబ్యూ ఆగస్ట్ 16న, 2015 ఎఫ్ఎఫ్ ఆగస్ట్ 12న భూ గ్రహాన్ని దాటేయనున్నాయి. నాసా ఆస్టరాయిడ్ వాచ్ భూమి నుండి 7.5 మిలియన్ కిలోమీటర్ల లోపు వచ్చే గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేస్తుంది, ఇది భూమి, చంద్రుని మధ్య దూరం కంటే 19.5 రెట్లు ఎక్కువ. ఆ దూరంలోపు ఆ పరిమాణంలో ఉన్న వస్తువుపై భూ గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది. ఆ వస్తువును భూమి ఆకర్షిస్తే అత్యంత దారుణ పరిణామాలు సంభవిస్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more