దేశ అర్థిక రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. టీవీ సీరియల్ చూస్తూ వంట చేయడం ఓ గృహిణి ప్రాణాలనే బలితీసుకుంది. టీవీ సీరియల్ ప్రసారం అవుతున్న సమయంలో వంట చేసిన ఆమె అనుకోకుండా ఆసుపత్రి పాలుకాగా చికిత్స పొందుతూ మరణించింది. రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదకరం అంటూ పెద్దలు చెప్పిన విషయం నిజమని ఈ ఘటన మరోమారు నిరూపించింది. ముంబైలోని మలాద్ ప్రాంతంలో తన భర్త, మరిదితో కలసి జీవిస్తున్న రేఖా నిషాద్ అనే 27ఏళ్ల మహిళకు ఓ వైపున టీవీ సీరియల్ ను చూస్తూ.. మరో వైపు వంట చేయడం అమె ప్రాణాలనే తీసింది.
మలాద్ ప్రాంతంలో పాస్కల్ వాడిలో నివసిస్తోన్న రేఖా నిషాద్.. తన ఇంట్లో ఎలుకలు ఎక్కవగా ఉన్నాయని వాటిని చంపేందుకుని టమాటాలో ఎలుకల సంహారక మందును పెట్టి ఉంచింది. ఇక ఆమె తన ఇంట్లో పనులు చేసుకుంటూ టీవీలో వస్తున్న తనకు ఇష్టమైన సీరియల్ చూస్తూ నూడిల్స్ తయారు చేస్తోంది. నూడిల్స్ లో టమాటాలు వేస్తూ ఇంకా రుచికరంగా ఉంటుందని భావించిన అమె.. తన ఇంట్లోని టమాటాలను తీసి కట్ చేసింది. అయితే ఈక్రమంలో అమె తన పూర్తి ధ్యాస టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్ పైనే పెట్టడంతో అంతుకుముందు అమె చేసిన పని అమెకు గుర్తులేకుండా పోయింది.
ఎలుకలను చంపేందుకు ఎరకోసం కొన్ని టమాటాలను కూడా తీసుకుని అమె తాను తయారు చేస్తున్న మ్యాగిలో వేసేందుకని కట్ చేసింది. దీంతో ఎలుకల మందు కలిపిన టమాటాలతో మ్యాగీ కాస్తా విషపూరితం అయ్యింది. అయినా దానిని పట్టించుకోకుండా వెంటనే వేడి వేడిగా లాగించేస్తే బాగుటుందనుకుని తనకు ఇష్టమైన టీవీ సీరియల్ చూస్తూనే మ్యాగినీ తినింది. నూడిల్స్ తిన్న కాసేపటికే రేఖా అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకుంటుండడంతో భర్త, మరిది ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more