Mumbai woman dies after eating Maggi laced with poison మహిళ ప్రాణం తీసిన టీవీ సీరియల్.. మ్యాగీలో వండుతూ..

Woman dies after eating instant noodles with tomatoes laced with rat poison

Maggi, rat poison, Rekha Nishad, instant noodles, Tomatos, Maggi noodles, rat poison, malad, Mumbai, Mumbai news, Maharashtra, Crime news

A 27-year-old woman died in Mumbai after accidentally consuming food laced with rat poison, police said. While making instant noodles, the woman accidentally added tomato that was laced with rat poison. The incident occurred in Pascal Wadi area in Mumbai's Malad. Police said that the woman, identified as Rekha Nishad, had laced tomatoes to kill rats in the house on July 21.

మహిళ ప్రాణం తీసిన టీవీ సీరియల్.. మ్యాగీలో వండుతూ..

Posted: 07/30/2022 11:52 AM IST
Woman dies after eating instant noodles with tomatoes laced with rat poison

దేశ అర్థిక రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. టీవీ సీరియల్ చూస్తూ వంట చేయడం ఓ గృహిణి ప్రాణాలనే బలితీసుకుంది. టీవీ సీరియల్ ప్రసారం అవుతున్న సమయంలో వంట చేసిన ఆమె అనుకోకుండా ఆసుపత్రి పాలుకాగా చికిత్స పొందుతూ మరణించింది. రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదకరం అంటూ పెద్దలు చెప్పిన విషయం నిజమని ఈ ఘటన మరోమారు నిరూపించింది. ముంబైలోని మలాద్ ప్రాంతంలో తన భర్త, మరిదితో కలసి జీవిస్తున్న రేఖా నిషాద్ అనే 27ఏళ్ల మహిళకు ఓ వైపున టీవీ సీరియల్ ను చూస్తూ.. మరో వైపు వంట చేయడం అమె ప్రాణాలనే తీసింది.

మలాద్ ప్రాంతంలో పాస్కల్ వాడిలో నివసిస్తోన్న రేఖా నిషాద్.. తన ఇంట్లో ఎలుకలు ఎక్కవగా ఉన్నాయని వాటిని చంపేందుకుని టమాటాలో ఎలుకల సంహారక మందును పెట్టి ఉంచింది. ఇక ఆమె తన ఇంట్లో పనులు చేసుకుంటూ టీవీలో వస్తున్న తనకు ఇష్టమైన సీరియల్ చూస్తూ నూడిల్స్ తయారు చేస్తోంది. నూడిల్స్ లో టమాటాలు వేస్తూ ఇంకా రుచికరంగా ఉంటుందని భావించిన అమె.. తన ఇంట్లోని టమాటాలను తీసి కట్ చేసింది. అయితే ఈక్రమంలో అమె తన పూర్తి ధ్యాస టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్ పైనే పెట్టడంతో అంతుకుముందు అమె చేసిన పని అమెకు గుర్తులేకుండా పోయింది.

ఎలుకలను చంపేందుకు ఎరకోసం కొన్ని టమాటాలను కూడా తీసుకుని అమె తాను తయారు చేస్తున్న మ్యాగిలో వేసేందుకని కట్ చేసింది. దీంతో ఎలుకల మందు కలిపిన టమాటాలతో మ్యాగీ కాస్తా విషపూరితం అయ్యింది. అయినా దానిని పట్టించుకోకుండా వెంటనే వేడి వేడిగా లాగించేస్తే బాగుటుందనుకుని తనకు ఇష్టమైన టీవీ సీరియల్ చూస్తూనే మ్యాగినీ తినింది. నూడిల్స్ తిన్న కాసేపటికే రేఖా అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకుంటుండడంతో భర్త, మరిది ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles