తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రాజకీయాలకు రాక మునుపు ఆమె వైద్య వృత్తిలో కొనసాగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ప్రయాణిస్తున్న విమానంలో ఓ వ్యక్తి అనారోగ్యానికి గురికాగా.. హుటాహుటిన స్పందించిన గవర్నర్ అతడికి వైద్య చికిత్స అందించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఇండిగో విమానంలో గవర్నర్ తమిళిసై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతుండగా విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా? అని సిబ్బంది అనౌన్స్ చేశారు. విషయం తెలుసుకున్న తమిళి సై వెంటనే స్పందించారు.
ఆ ప్రయాణికుడి వద్దకు వెళ్లి ప్రాథమిక చికిత్స అందించి భరోసా కల్పించారు. దాంతో కోలుకున్న సదరు ప్రయాణికుడు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు. అత్యవసర సమయంలో తమిళి సై స్పందించిన తీరు, ప్రయాణికుడికి చికిత్స అందించిన విధానంతో తోటి ప్రయాణికులు సైతం అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తోటి ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టులు చేయగా నెటిజన్లు ప్రశంసలు కురిపిసుస్తున్నారు. మీరు గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అలాగే గొప్ప వైద్యులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా మెడికల్ వింగ్ కార్యదర్శిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన తమిళిసై తాను రాజకీయాల్లోకి రాక మునుపు వైద్య వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజ్లో ఆమె MBBS పూర్తి చేశారు. అలాగే డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ కాలేజ్ నుంచి డీజీఓ కోర్సు పూర్తి చేశారు. కెనడాలో సోనోలాజీ మరియు ఎఫ్ఈటీ థెరపీలలో ప్రత్యేక శిక్షణను కూడా పొందారు. ఆ తర్వాత చెన్నైలోని శ్రీరామచంత్ర మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన కెరీర్ను ప్రారంభించిన తమిళిసై.. దాదాపు మూడు దశాబ్దాలుగా ఫిజీషియన్గా సేవలందిస్తుండటంతో ఆమె అందరికీ సుపరిచితులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more