హైదరాబాద్ చిక్కడపల్లిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆంధప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన న్యాయవాది శివారెడ్డి తన లైస్సెన్సు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని బాగ్ లింగంపల్లిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యతో కొంతకాలం క్రితం విడిపోయిన న్యాయవాది.. బాగ్ లింగంపల్లిలో ఒంటరిగా నివసిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆయన.. ఇవాళ ఉదయం ఈ దారుణానికి పాల్పడ్డాడు.
చిక్కడపల్లి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన శివారెడ్డి ఇండియన్ ఎయిర్ పోర్స్ సెర్జియంట్ గా విధులు నిర్వహించాడు. ఆ తరువాత స్వచ్ఛంధ పదవీ విరమణ తీసుకున్న ఆయన.. న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నాడు. బాగ్ లింగంపల్లిలో ఉన్న తన ఫ్లాటులో నివసిస్తూన్నాడు. శివారెడ్డి తన భార్య నుంచి గతకొంత కాలం క్రితం విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఈరోజు ఉదయం 6గంటలకు కడప నుంచి హైదరాబాద్ వచ్చారు. అయితే ఆయన సోదరి కీడు శంఖించి పలుమార్లు ఫోన్ చేసినా తీయలేదు.
బంధువులు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన ఆయన సోదరి మహేశ్వరి.. తీవ్ర ఆందోళనకు గురైంది. కాచిగూడలోని తన స్నేహితురాలు లక్ష్మీ భవాణిని ఫోన్ చేసి.. విషయం చెప్పి.. చూడమని చెప్పగా అమె తన తల్లితో కలసి వెళ్లింది. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్న కారణంగా తలుపు తెరుచుకోలేదు. దీంతో వారు అక్కడే కాపాలా ఉన్న వాచ్ మెన్ సాయంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన లైసెన్స్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more