Lawyer Shiva Reddy shot himself in Hyderabad తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య

After separation from wife kadapa lawyer shot himself in hyderabad

Kadapa Lawyer, Lawyer Shiva Reddy, separation from wife, Indian Air Force (IAF), Maheshwari, Lakshmi Bhavani, Kachiguda area, IAF sergeant, Voluntary retirement, Kadapa, suicide, shot self, Bagh Lingampally, Chikkadpally police, Hyderabad, Telangana, crime

A lawyer shot himself dead at his residence at Baghlingampalli area in Hyderabad, police said. Shiva Reddy (44) killed himself by opening fire from his licensed revolver. Hailing from Andhra Pradesh’s Kadapa district, he had earlier served in the Indian Air Force (IAF) as a sergeant. After taking voluntary retirement from IAF, he was practicing as an advocate.

భార్యతో విడిపోయి.. తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య

Posted: 07/22/2022 08:53 PM IST
After separation from wife kadapa lawyer shot himself in hyderabad

హైదరాబాద్‌ చిక్కడపల్లిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆంధప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన న్యాయవాది శివారెడ్డి తన లైస్సెన్సు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని బాగ్ లింగంపల్లిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యతో కొంతకాలం క్రితం విడిపోయిన న్యాయవాది.. బాగ్ లింగంపల్లిలో ఒంటరిగా నివసిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆయన.. ఇవాళ ఉదయం ఈ దారుణానికి పాల్పడ్డాడు.

చిక్కడపల్లి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన శివారెడ్డి ఇండియన్ ఎయిర్ పోర్స్ సెర్జియంట్ గా విధులు నిర్వహించాడు. ఆ తరువాత స్వచ్ఛంధ పదవీ విరమణ తీసుకున్న ఆయన.. న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నాడు. బాగ్ లింగంపల్లిలో ఉన్న తన ఫ్లాటులో నివసిస్తూన్నాడు. శివారెడ్డి తన భార్య నుంచి గతకొంత కాలం క్రితం విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఈరోజు ఉదయం 6గంటలకు కడప నుంచి హైదరాబాద్‌ వచ్చారు. అయితే ఆయన సోదరి కీడు శంఖించి పలుమార్లు ఫోన్ చేసినా తీయలేదు.

బంధువులు ఫోన్‌ చేసినా ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చిన ఆయన సోదరి మహేశ్వరి.. తీవ్ర ఆందోళనకు గురైంది. కాచిగూడలోని తన స్నేహితురాలు లక్ష్మీ భవాణిని ఫోన్ చేసి.. విషయం చెప్పి.. చూడమని చెప్పగా అమె తన తల్లితో కలసి వెళ్లింది. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్న కారణంగా తలుపు తెరుచుకోలేదు. దీంతో వారు అక్కడే కాపాలా ఉన్న వాచ్ మెన్ సాయంతో తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన లైసెన్స్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles