హోటళ్లు, రెస్టారెంట్లలో జారీ చేసే బిల్లులలో తప్పనిసరిగా సర్వీసు ఛార్జ్ వేయకూడదన్న నిబంధనలపై ట్విస్టు ఏర్పడింది. సర్విసు చార్జీలు కస్టమర్ల ఇష్టాఇష్టాలపై అధారపడిన అంశమే కానీ.. డానిని తప్పనిసరి చేస్తూ రెస్టారెంట్లు, హోటల్ యాజమాన్యాలు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. గతంలో ఇచ్చిన అదేశాలను జారీ చేసింది. దీంతో తప్పనిసరి సర్వీసు చార్జీలను వసూలు చేయడాన్ని నిషేధిస్తూ.. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) ఇటీవల నూతన అదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా సీసీపీఏ జారీ చేసిన నిబంధనలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. జాతీయ రెస్టారెంట్ల సంఘం, జాతీయ హోటళ్ల సంఘం ఈ నిబంధనలపై అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నవంబర్ 25 వరకు సీసీపీఏ తెచ్చిన నిబంధనలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల విధింపు విషయాన్ని మెనూలో, బహిరంగంగా ప్రదర్శించాలని.. టేక్అవేపై ఎలాంటి ఛార్జీలు విధించరాదని సూచించింది. వినియోగదారుడు ఛార్జీలు కట్టడానికి ఇష్టపడకపోతే.. రెస్టారెంట్కు రావద్దని, అది అతడి ఎంపిక అని తెలిపింది.
అంతకుముందు జులై 4న హోటల్స్, రెస్టారెంట్స్లో సర్వీస్ ఛార్జ్ బాదుడు నుంచి ఉపశమనం కలిగించేలా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కీలక ఆదేశాలు వెలువరించింది. బిల్లో ఆటోమెటిక్గా సర్వీస్ ఛార్జ్ వేయడాన్ని నిషేధిస్తూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్ అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ ఛార్జ్ విషయంలో ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ ఈ మేరకు చర్యలు తీసుకుంది. హోటల్స్, రెస్టారెంట్లు బిల్స్ వేయడంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more