పానీ పూరి పేరు చెబితే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. గోళానికి ఓ వైపు విరగగొ్ట్టి.. అందులో వేడివేడి చాట్ వేసి.. దానిని చేదు మినహాయించి షడ్రుచుల కలిసిన నీటిని నింపి.. చకచకా అందిస్తుండే.. వాటిని అమాంతం నోటిలో పెట్టుకుని కేవలం దవడలను దగ్గరకు తీసుకురావడంత అది కాస్దా విరిగి అందులోని నీరు, చాట్ అంటా నోటి నిండుగ కాగా, నీటిని మింగేసి.. మిగతాదంగా నమిలేసి మళ్లీ మరో గోల్ గప్పా కోసం రెడీ అవుతాం. ఇక మరికోందరు వీటిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని తింటారు. ఇక కాస్తా కాస్ట్లీ సెంటర్లలో వీటిలో పెరుగును, లేదా స్వీటును కూడా పూరించి ఇస్తారు.
ఇలా దీనిని ఎలా అరగిస్తారని చెబుతుంటేనే నోరూరుతుంది కదూ.. కానీ అలాంటి పానీ పూరిపై రాజధాని నగరంలో నిషేధం విధించారంటే నమ్మశక్యమేనా.? అన్న అనుమానాలు వస్తున్నాయానా.? పానీపూరి.. ఛాట్ పై అధారపడి కొన్ని వేల కుటుంబాటు జీవనం సాగిస్తున్నాయి. ఇక వీటిపై నిషేధం విధిస్తే మరి వారికి మరో జీవనాధారం చూపించాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే ఉంది. అయితే ఈ నిషేధం విధింపు మన హైదరాబాద్ నగరంలోనో.. లేక అమరావతి నగరంలోనో కాదు.. అసలు మన రాష్ట్రాలోనే కాదు, మన దేశమే కాదు.. మరెక్కడా అంటారా.. మన పోరుగు దేశంలో. అదేనండీ నెపాల్ లో. నేపాల్ లోని ఖాట్మండులో పానీ పూరిపై నిషేధం విధించారు.
అయితే అందుకు తగు కారణాలను అక్కడి అధికారులు పేర్కోన్నారు. కలరా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయన్న కారణంగా నేపాల్ రాజధాని ఖాట్మండులో పానీ పూరీపై నిషేధం విధించారు. ఇక్కడి లలిత్ పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పానీపూరీకి ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట. దీంతో ఇక్కడ పానీపూరీ అమ్మకాలు నిషేధిస్తున్నట్లు లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీ (ఎల్ఎంసీ) అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ప్రజలంతా డయేరియా, కలరా వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 17 | స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం... Read more
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more