Four Pak Terrorist Killed In Kupwara Encounter శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

Four lashkar terrorists killed in kupwara encounter in jammu kashmir

terrorism, J&K, Kashmir, Jammu and Kashmir, Srinagar encounter, Bemina area encounter, Jammu and Kashmir terrorists, security forces, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, one policeman injured, jammu kashmir encounter, bemina encounter JK, Jammu encounter, CRPF forces, Jammu Kashmir encounter, Srinagar Encounter, terrorists killed in Central Kashmir, search operation in J&K, LeT terrorists killed, Srinagar, Jammu and Kashmir, National politics

Four terrorists from Lashkar-e-Taiba (LeT) were killed and one policeman was injured in a late night encounter between the security forces and the terrorists at Kupwara in Central Kashmir’s, Srinagar, according to officials.

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

Posted: 06/20/2022 11:35 AM IST
Four lashkar terrorists killed in kupwara encounter in jammu kashmir

జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లో ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటరల్లో నలుగురు పాక్ ప్రేరేమిత ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేస్తున్న భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. దీంతో జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదలు ఏరివేతలో భారత భద్రతా బలగాలు విజయం సాధించాయి. కుప్వారాలో జరుగుతున్న ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదలు హతమయ్యారు.

కాగా, ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల ఘటనలో మొత్తం నలుగురు ఉగ్రవాదులను భారత బద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ సందర్భంగా ఘటనాస్థలం నుంచి భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  ప్రస్తుతం సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి రాబట్టిన సమాచారంతో.. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించారు.

ఈ క్రమంలో బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపడంతో నలుగురు మృతి చెందారని సోమవారం పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల్లో పాక్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది షౌకత్ అహ్మద్ షేక్ సైతం ఉన్నట్లు చెప్పారు. ఆదివారం కుల్గామ్‌ జిల్లా దమ్హాల్‌ హంజిపోరా ప్రాంతంలో గుజ్జర్‌పోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకోగా.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను కుల్గామ్‌కు చెందిన జాకీర్ పదార్, శ్రీనగర్‌కు చెందిన షరీఫ్‌గా గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles