రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని పేర్కొంది. ఉత్తర్ప్రదేశ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉత్తర-దక్షిణ ఉపరితలద్రోణి ఏర్పడింది. దీంతో రెండ్రోజుల పాటు పలు జల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన రెండ్రోజుల్లోనే పలు ప్రాంతాల్లో కంభవృష్టి కురుస్తోంది. ఫలితంగా హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఇవాళ మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అటు ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా ఉత్తర భాగాలు, గుంటూరు జిల్లా మీదుగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని పేర్కోంది. ఇవాళ విజయవాడ జిల్లాతో పాటుగా ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అర్ధరాత్రి సమయం నుంచి విజయవాడ ఏలూరు జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి
మరోవైపు దేశవ్యాప్తంగానూ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో కూడా బుధవారం అర్ధరాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఎండలతో విలవిలలాడిన ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అస్సాం రాజధాని గౌహతిలో కొండచరియలు విరిగి పడిన ఘటనలు నమోదయ్యాయి. ఫలితంగా అస్సాం వరదలతో గీతానగర్, సోనాపూర్, కలాపహార్, నిజార్పార్ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. అనిల్ నగర్, నిబిన్ నగర్, రాజ్గర్ లింక్ రోడ్డు, రుక్మిణిగావ్, హటిగావ్ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. మంగళవారం బోరేగావ్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో నలుగురు సజీవ సమాధి అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more