అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ను అభివృద్ది పరుస్తున్నామని ఓవైపు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు హైదరాబాదు ప్రతిష్టను దిగజార్చేలా పలు ఘటనలు మరోవైపు జరుగుతున్నాయి. ఇటీవల మైనర్ బాలురు మైనర్ బాలికలను ట్రాప్ చేసి.. వారిపై అత్యాచారాలు జరిపిన వరుస ఘటనలు నమోదయ్యాయి. దీంతోనే అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు విమర్శలు ఎదుర్కోంటుండగా.. వీటితో హైదరాబాద్ నగర ప్రతిష్ట కూడా మసకబారింది. విశ్వనగరం చేసేందుకు గత దశాబ్దాలుగా ప్రభుత్వాలు చేసిన చర్యలపై కొన్ని వరుస ఘటనలు సవాల్ చేసేలా ఉన్నాయి.
అందులోనూ హైదరాబాద్ లోని అత్యంత సంపన్నప్రదేశమైన జూబ్లిహిల్స్ లో దారుణఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.ఈ ఘటనపై సినీనటుడు, సామాజిక కార్యకర్త సోనుసూద్, దేశ దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఖండించారు. అంతలా హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ జరిగింది. ఇక ఇటీవల మైహదీపట్నం ఆసిప్ నగర్ లో యువకులు వీరంగం చేసి ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనాన్నే ధ్వంసం చేశారు. గంజాయి మత్తులో జోగుతూ.. వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. పోలీసులపై తిరగబడ్డి..పెట్రోలింగ్ వాహనంపైకి ఎక్కి వీరంగం వేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలు మరువక ముందే మరోమారు పాతబస్తీలో యువకులు బైకులపై హల్ చల్ చేశారు. కాలాపత్తర్లోని ఓ కాలనీలో బైక్లతో యువత ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హంగామా చేశారు. కాలనీలో ర్యాష్గా ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించిన యువకుడిపై బైకర్స్ దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఇంట్లోకి వెళ్లిన యువకుడిని వదలకుండా వెంబడించి.. ఇంట్లోకి దూరి మరీ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యులు గాయాలపాలైన ఇద్దరినీ చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీటీవీల ఆధారంగా దాడికి పాల్పడినవారిని గుర్తిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more