ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు గ్యాస్ లీక్ ఘటన పెనుకలకలం సృష్టించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ సెజ్ పరిధిలోని పోరస్ కంపెనీలో రసాయన వాయువు లీక్ కావడంతో అనేక మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పోరస్ కంపెనీలో అమోనియా వాయువు లీకైంది. దీంతో పక్కనున్న సీడ్స్ కంపెనీలో పనిచేసే వంద మందికి పైగా మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమోనియా వాయువును పీల్చుకున్న మహిళలు తీవ్ర లక్షణాలతో ఇబ్బందులు పడ్డారు. కోందరికి వాంతులు, తల తిరగడం, కళ్ల మంటలెత్తడం ఇలా పలువురు పలు లక్షణాలతో ఇబ్బంది పడ్డారు.
అస్వస్థతకు గురైన మహిళలను హుటాహుటిన బ్రాండిక్స్ సెజ్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కాగా కొందరు మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తేలడంతో వారిని అంబులెన్సుల్లో అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో మహిళా సెక్యూరిటీ సూపర వైజర్ పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే అమెకు అసరమైన చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. అమోనియా లీక్ ఘటన వివరాలు తెలుసుకున్న కలెక్టర్ రవిసుభాష.. మహిళా కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి హేమంత్ కుమార్ను ఆదేశించారు.
అస్వస్థులైన మహిళలకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు బ్రాండిక్స్ భారత భాగస్వామి దొరైస్వామి చెప్పారు. సెజ్కు వెలుపల ఉన్న పోరస్ కంపెనీ నుంచి అమోనియా వాయువు లీకైందని.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. దీనివల్లే సమస్య తలెత్తిందన్నారు. ఈ లీక్ వార్త అందిన వెంటనే పోరస్ కంపెనీ నిర్వాహకులు అమోనియో లీకేజీని అరికట్టినట్లు చెప్పారు. అయితే ఈ రసాయన వాయువు ఎలా లీకైందన్న కారణాలేంటన్నది తెలుసుకుంటున్నట్లు వివరించారు. కంపెనీ సేప్టీ అధికారులు దీనిని పరిశీలించి యాజమాన్యానికి నివేదిక అందించనున్నారు.
అమోనియా లీకేజీ ఘటనతో అప్రమత్తమైన బ్రాండిక్స్ నిర్వాహకులు.. రెండో షిఫ్ట్ రద్దు చేశారు. ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించివేశారు. ఇదిలా ఉండగా ఈ రసాయన వాయువు లీక్ ఘటనపై ప్రభుత్వం కూడా విచారణకు అదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమోనియా గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలిని సందర్శించాలని పరిశ్రమల శాఖ మంత్రికి సూచించారు. గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more