Bank manager from Rajasthan shot dead in Kulgam కాశ్మీర్ లో బ్యాంకు మేనెజర్ ను కాల్చిచంపిన ఉగ్రవాదులు

Bank manager from rajasthan shot dead in jammu and kashmir s kulgam

J-K Police, Kulgam, bank manager, Vijay Kumar, Ellaquai Dehati Bank, Are, Mohan Pora, Hanumangarh, rajasthan, terrorists, Jammu and Kashmir, Crime

A bank manager from Rajasthan was shot dead in Kulgam on Thursday, the latest incident in a series of attacks in the state. Terrorists fired upon the man, identified as Vijay Kumar, who worked at the Ellaquai Dehati Bank at Are, Mohan Pora, in Kulgam district in South Kashmir. Kumar, who hailed from Hanumangarh in Rajasthan, was taken to a hospital where he succumbed to his injuries.

జమ్మూకాశ్మీర్: కుల్గామ్ లో బ్యాంకు మేనెజర్ ను కాల్చిచంపిన ఉగ్రవాదులు

Posted: 06/02/2022 11:38 AM IST
Bank manager from rajasthan shot dead in jammu and kashmir s kulgam

జమ్మూకాశ్మీర్ లో భారత భద్రతా బలగాలు.. పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో పాటు సరిహద్దులోకి చోచ్చుకువచ్చిన పాకిస్థాన్ ఉగ్రవాదులను కూడా ఎన్ కౌంటర్లలో హతమారుస్తూనే ఉంది. అయినా ఎక్కడ నుంచి వస్తున్నారో తెలియదు కానీ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు పాక్ కు చెందిన ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోయలో ప్రతినిత్యం అలజడి సృష్టిస్తున్నారు. కాశ్మీర్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తరువాత కొన్నాళ్ల పాటు స్ధబ్ధుగా ఉన్న కాశ్మీర్ లో ఇప్పుడు నిత్యం తుపాకుల మోత మోగుతోంది.

నిన్నమొన్నటి వరకు ఉనికి చాటుకునేందుకు జంకిన ఉగ్రవాదులు.. ఇప్పుడు దేశపౌరులను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఓ స్థానిక కాశ్మీర్ పండిట్ తో పాటు, పోలీసు సిబ్బందని, అధికారులను, ఉపాధ్యయులను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు ఇక తాజాగా బ్యాంకు అధికారిని కాల్చివేశారు. కాశ్మీర్ లో భారత్ వ్యవస్థలను దెబ్బతీయడమే ఉగ్రవాదలు తమ టార్గెట్ గా పెట్టుకున్నారా.? అన్న అనుమానాలు కూడా ఈ ఘటనలతో తెరపైకి వస్తున్నాయి. ప్రతీ రోజు ఉగ్రవాదుల చేతుల్లో ఎవరో ఒక అధికారి హత్యకు గురికావడం అందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటికే తాము కాశ్మీర్ ను వీడుతామని పండిట్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.

ఇక తాజాగా జరిగిన ఘటనలో జ‌మ్మూక‌శ్మీర్‌లోని బ్యాంక్ మేనేజ‌ర్‌ను ఉగ్ర‌వాదులు కాల్చివేశారు. దక్షిణ కాశ్మీర్ లోని కుల్గామ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాజస్థాన్ కు చెందిన విజయ్ కుమార్ ఇలాఖాహి దెహ‌తి బ్యాంక్‌లో మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. దాడి త‌ర్వాత హాస్పిట‌ల్‌కు త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘ‌ట‌న‌లో విజ‌య్‌కు తీవ్ర‌మైన బుల్లెట్ గాయాల‌య్యాయి. ఆయ‌న స్వ‌స్థ‌లం రాజ‌స్థాన్‌లోని హ‌నుమాన్‌ ఘ‌ర్‌. కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. కాగా నిన్న కాశ్మీర్ లోయలో ఓ ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles