జమ్మూకాశ్మీర్ లో భారత భద్రతా బలగాలు.. పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో పాటు సరిహద్దులోకి చోచ్చుకువచ్చిన పాకిస్థాన్ ఉగ్రవాదులను కూడా ఎన్ కౌంటర్లలో హతమారుస్తూనే ఉంది. అయినా ఎక్కడ నుంచి వస్తున్నారో తెలియదు కానీ ప్రేరేపిత ఉగ్రవాదులతో పాటు పాక్ కు చెందిన ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోయలో ప్రతినిత్యం అలజడి సృష్టిస్తున్నారు. కాశ్మీర్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తరువాత కొన్నాళ్ల పాటు స్ధబ్ధుగా ఉన్న కాశ్మీర్ లో ఇప్పుడు నిత్యం తుపాకుల మోత మోగుతోంది.
నిన్నమొన్నటి వరకు ఉనికి చాటుకునేందుకు జంకిన ఉగ్రవాదులు.. ఇప్పుడు దేశపౌరులను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఓ స్థానిక కాశ్మీర్ పండిట్ తో పాటు, పోలీసు సిబ్బందని, అధికారులను, ఉపాధ్యయులను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు ఇక తాజాగా బ్యాంకు అధికారిని కాల్చివేశారు. కాశ్మీర్ లో భారత్ వ్యవస్థలను దెబ్బతీయడమే ఉగ్రవాదలు తమ టార్గెట్ గా పెట్టుకున్నారా.? అన్న అనుమానాలు కూడా ఈ ఘటనలతో తెరపైకి వస్తున్నాయి. ప్రతీ రోజు ఉగ్రవాదుల చేతుల్లో ఎవరో ఒక అధికారి హత్యకు గురికావడం అందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటికే తాము కాశ్మీర్ ను వీడుతామని పండిట్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.
ఇక తాజాగా జరిగిన ఘటనలో జమ్మూకశ్మీర్లోని బ్యాంక్ మేనేజర్ను ఉగ్రవాదులు కాల్చివేశారు. దక్షిణ కాశ్మీర్ లోని కుల్గామ్లో ఈ ఘటన జరిగింది. రాజస్థాన్ కు చెందిన విజయ్ కుమార్ ఇలాఖాహి దెహతి బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. దాడి తర్వాత హాస్పిటల్కు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘటనలో విజయ్కు తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయన స్వస్థలం రాజస్థాన్లోని హనుమాన్ ఘర్. కాల్పుల ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. కాగా నిన్న కాశ్మీర్ లోయలో ఓ ఉపాధ్యాయురాలిని ఉగ్రవాదులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more