స్థానబలం అన్న పదం విన్నరా.. అలాంటిది తన అడ్డాలోకి వచ్చిన వారిని వదలదు మొసలి. మొసలి స్థానబలం నీరు అన్న విషయం తెలిసిందే. నీటిలో ఉండగా దాని పట్టు ముందు గజరాజు కూడా వెనకబడాల్సిందే అని గజేంద్రమోక్షం కథ కూడా చెబుతోంది. మకరానికి చిక్కిన గజరాజు తనను రక్షించాలని శ్రీమహావిష్ణువును వేడినే వెంటనే ఆయన ఉన్నఫలంగా వైకుంఠ వదిలి సరోవరానికి చేరి మొసలి తలను సుదర్శన చక్రంతో ఖండించి రక్షించిన కథ తెలిసిందే. ఇక ఇటీవల ఒక చిరుత నీటిని తాగేందుకు ఓ నది ఒడ్డుకు చేరిగానే అదను చూసి దానిని నోటకరుచుకుపోయిన విషయం కూడా తెలిసిందే.
అలాంటి మొసలిని దానికి అత్యంత బలమున్న నీటిలోనే ఓడించి ఒడ్డుకు చేరిన 14 ఏళ్ల మైనర్ బాలుడి గురించి తెలుసా.? ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం ఉత్త చేతులతోనే దానిని మట్టికరిపించి.. ఈ బాలయోధుడు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. ఔనా.. ఇదంతా నిజమా.. అన్న సందేహాటు వస్తున్నాయా.? కానీ ఇది ముమ్మాటికీ నిజం.. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒడిషా రాష్ట్రంలోని కేంద్రపరా జిల్లా నేషనల్ పార్క్ పరిధిలో భితర్కనికా నది ఉంది. అరజా గ్రామానికి చెందిన కొందరు కుర్రాళ్లు రోజుమాదిరిగానే సరదాగా ఆ నది ఒడ్డుకు ఈతకు వెళ్లారు.
అందులో పద్నాలుగేళ్ల ఓంప్రకాశ్ సాహోను.. ఉన్నట్లుండి ఏడడుగుల పొడవు ఉన్న ఓ మొసలి నీళ్లలోకి లాక్కెల్లింది. నడుము లోతు నీటిలోకి మునిగిపోయిన కుర్రాడు.. ప్రాణ భయంతో కేకలు వేశాడు. వెంటనే మిగతా పిల్లలు ఒడ్డుకు చేరి సాయం కోసం స్థానికులను పిలిచారు. అయితే అప్పటికే మొసలి నోట్లో సాహో చిక్కుకుపోయాడు. ఈలోపు ఒడ్డున్న ఉన్న కొందరు మొసలిపైకి రాళ్లు విసరడం మొదలుపెట్టారు. ఇదే అదనుగా శక్తిని కూడదెచ్చుకుని మొసలి కళ్లలో తన వేళ్లతో పొడిచి.. దాని తలపై పిడిగుద్దులు గుద్దాడు సాహో. ఆ దెబ్బకి విలవిలలాడుతూ.. అతన్ని వదిలేసి దూరంగా వెళ్లిపోయింది మొసలి.
ఒడ్డుకు ఎలాగోలా చేరిన కుర్రాడిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాళ్లు చేతులకు గాయాలు కావడంతో కటక్ ఎస్సీబీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు వైద్యులు. సాహసంతో మొసలితో పోరాడి.. ప్రాణాలతో బయటపడ్డ ఆ కుర్రాడిని అంతా మెచ్చుకుంటున్నారు. ఇదిలాఉంటే నెల వ్యవధిలో భితర్కనికా నదిలో ఒడిషాలో మొసళ్ల బారిన పడి ముగ్గరు చనిపోయారని, ప్రస్తుతం మకరాలు గుడ్లుపెట్టే సమయం కావడంతో.. అవి నీరు ఉద్దృతి అధికంగా లేని ప్రాంతాలకు చేరి అక్కడ అనువైన ప్రదేశాల్లో గుడ్లను పెడాతాయని వన్యప్రాణ అధికారులు తెలిపారు.
ఈ తరుణంలో నదీ పరివాహిక ప్రాంతాల ప్రజలను ఇప్పటికే నదులకు వెళ్లే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశామని, దానిని మరింత విసృత పరుస్తామని చెప్పారు. మే నెల చివరితో మొదలుకుని శీతాకాలం వరకు మకరాలు పిల్లల్ని పెట్టే సమయమని అధికారులు తెలిపారు. ఈ సమయంలో మనుషులకు- మకరాలకు మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సహజమని, అందుకనే అప్రమతత్త అవసరమని అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more