ప్రతీ మగవాడి జీవితంలోనూ మౌనంగా వెనకాలే ఉంటూ ముందుకునడిపే స్త్రీమూర్తి ఉంటుంది. అమె ధర్మపత్ని. ఆ జీవిత భాగస్వామి కోసం ఎవరైనా ఏమైనా చేశారా.? అంటే మీనవేషాలు లెక్కించేవారి సంఖ్యే ఎక్కువ. కానీ ఇక్కడ ఈ యాచకుడు తన భార్య కోసం రూపాయి రూపాయి పోదుపు చేసి ఏకంగా కొత్త మూడు చక్రాల బండినే కొన్నాడు. ఔనా.. అంటూ విస్తుపోవాల్సినంత అవసరం లేదు. దాదాపుగా ఆరయ్యవ పడిలోకి అడుగుపెడుతన్న ఆయన.. ఈ వయస్సులో తన భార్య కోరిక తీర్చాలని ఎందుకు భావింాడు. భిక్షాటనే చేస్తూనే దానిని ఎలా సఫలీకృతం చేశాడు.?ఎందుకనీ ఆయన ఈ బండి కొన్నాడు అన్న వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లా కేంద్రంలో వీరు ట్రై సైకిల్ (మూడు చక్రాల సైకిల్) ద్వారా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. సంతోష్ కుమార్ సాహుకు కాళ్లలో వైకల్యం ఉంది. అందుకే అతడు మూడు చక్రాల సైకిల్ పై కూర్చుని హ్యాండిల్ పట్టుకుంటే.. అతడి భార్య సైకిల్ ను వెనుక నుంచి నెట్టేది. ఆలయాలు, మసీదుల వద్ద వీరు అడ్డుక్కునేవారు. అయితే, వయసు పెరగడం, కచ్చా రోడ్లు, ఎత్తయిన చోట్ల సైకిల్ ను తోయాల్సి రావడంతో సాహు భార్యకు నడుము నొప్పి వేధించసాగింది. ఆమె నొప్పితో నరకాన్ని అనుభవిస్తుంటే సాహు చూడలేకపోయాడు.
ఇంతకాలం రూపాయి, రూపాయి అడుక్కుని కూడబెట్టుకున్న సొమ్ముతో త్రిచక్ర మోటారు మోపెడ్ ను కొనుగోలు చేశాడు. రూ.90,000 ఖర్చు అయింది. దీంతో తోసే పని తప్పింది. దాంతో ఇద్దరూ కలసి సులభంగా ఎక్కడికైనా చేరుకుని భిక్షాటన వృత్తిని చేసుకుంటున్నారు. అయితే ఈ బైక్ తో వచ్చిన మార్పు ఏంటంటే.. మోటారు వాహనం వల్ల తాము ఇప్పుడు సియోని, ఇటార్సీ, భోపాల్, ఇండోర్ ప్రాంతాలకు కూడా వెళ్లి అడుక్కోగలుగుతున్నట్టు సాహు చెప్పాడు. వీరి సంపాద రోజువారీగా గతంలో అయితే రూ.300-400 వరకు ఉండేది. మారుతున్న జీవన విధానాలు, ఖర్చు పెట్టే ధోరణులకు ఇది కూడా ఒక నిదర్శనమే.
#Inspiration https://t.co/npvAvq9iPX
— Abhinandan Dutta (@abhid_55) May 24, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more