SC rejects Navjot Singh Sidhu time seeking petition నవజ్యోత్ సింగ్ సిద్దూకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

Navjot singh sidhu seeks more time to surrender after being sentenced

Navjot Singh Sidhu jail, Navjot Singh Sidhu news, Navjot Singh Sidhu murder, Navjot Singh Sidhu road rage case, Navjot Singh Sidhu, Navjot Singh Sidhu news, Navjot Singh Sidhu jail, Navjot Singh Sidhu road rage case, navjot sidhu in jail, Navjot Singh Sidhu, 1988 road rage case, navjot singh sidhu in jail for 1 year, 2018 judgment

Chief Justice of India NV Ramana on Friday refused to entertain Congress leader Navjot Singh Sidhu's plea seeking some time before he surrenders in connection with the 1988 road rage case in which the top court on Thursday sentenced him to a year's imprisonment. The Congress leader, represented by senior advocate and Congress leader Abhishek Manu Singhvi, said he needs some time to organise his medical issues.

నవజ్యోత్ సింగ్ సిద్దూకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటీషన్ తిరస్కరణ

Posted: 05/20/2022 03:31 PM IST
Navjot singh sidhu seeks more time to surrender after being sentenced

పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్య కారణాలరీత్యా తానులొంగిపోవడానికి మరికొన్ని వారాల సమయం కావాలని కోరుతూ సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను అ‍త్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడం కుదరదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో సిద్ధూ నేడో రేపో సిద్ధూ లొంగిపోవాల్సి ఉంటుంది. టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకు అత్యున్నత న్యాయస్థానం నిన్న ఏడాది జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే.

1988లో రోడ్డుపై గొడవ పడిన ఘటనలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిని సిద్ధూ కొట్టారు. ఆయన కొట్టిన దెబ్బలు గుర్నామ్ తలకు బలంగా తగలడంతో ఆయన చనిపోయారు. ఈ కేసులోనే సిద్ధూకు సుప్రీంకోర్టు శిక్షను విధించింది. మరోవైపు, తాను లొంగిపోవడానికి కొన్ని వారాల సమయాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టును సిద్ధూ కోరారు. తనకు ఆరోగ్యం బాగోలేదని... ఈ కారణం వల్ల తనకు కొన్ని వారాల సమయాన్ని ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. సిద్ధూ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు కోర్టులో వాదనలు జరిగాయి.

క్రైమ్ జరిగి ఇప్పటికే 34 ఏళ్లు గడిచిపోయాయని... సుప్రీంకోర్టు శిక్షను విధించడం కూడా జరిగిందని... ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వారాల సమయం కావాలని అడగడం సరికాదని పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, సింఘ్వీ తన వాదలను వినిపిస్తూ... తన క్లయింట్ లొంగిపోతాననే చెపుతున్నారని, కేవలం కొంత సమయాన్ని మాత్రమే అడుగుతున్నారని కోర్టుకు తెలిపారు. సమయాన్ని ఇవ్వడం, ఇవ్వకపోవడమనేది కోర్టు నిర్ణయమని అన్నారు. ఈ సమయంలో జస్టిస్ ఖన్విల్కర్ కలగజేసుకుంటూ... సమయాన్ని కోరుతూ ఒక అప్లికేషన్ ను ఫైల్ చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles