దేశ ద్రోహానికి సంబంధించిన ఐపీసీలోని 124ఏ సెక్షన్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి కొంత సమయాన్ని కేటాయించింది. ఈ విషయంలో తుది నివేదిక సమర్పించే అంశమై ఈ నెల 9లోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. 1962లో కేదార్నాథ్ కేసులో ఇచ్చిన తీర్పు సమగ్రంగా ఉందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అప్పుడు ఆ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించిందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ మరో ధర్మాసనం దీన్ని విచారించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామన్నారు. ఈ చట్టం దుర్వినియోగం కాకుండా, నిబంధనలను రూపొందించవచ్చన్నారు.
ఈ సందర్బంగా మహారాష్ట్రలో ఒక ఎంపీపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన విషయాన్ని ఏజీ కేకే వేణుగోపాల్ ప్రస్తావించారు. ఒక ఎంపీ, తన భర్త అయిన ఎమ్మెల్యేతో పాటు హనుమాన్ చాలీసాను పఠించినందుకు వారిపై ఈ కేస్ పెట్టారన్నారు. ఇలాంటి దుర్వినియోగాలను అరికట్టాల్సి ఉందన్నారు. `దేశంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా! హనుమాన్ చాలీసా పఠించినందుకు దేశద్రోహం కేసు పెట్టారు. ఇలాంటి దుర్వినియోగాలను అరికట్టడానికి నిబంధనలను రూపొందించాల్సి ఉంది. అంతేకానీ, ఈ అంశాన్ని మరో పెద్ద ధర్మాసనం ముందుకు పునర్విచారణకు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు` అని ఏజీ వేణుగోపాల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు.
బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టానికి కాలం చెల్లిందని, దానిని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నాయని, దానిని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై ఇప్పటికే ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించినందున, ఇప్పుడు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తుందా? లేక ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనమే విచారణ కొనసాగిస్తుందా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టు త్వరలో తేల్చనుంది. 1962లో సుప్రీంకోర్టు కేదార్నాథ్ సింగ్ కేసులో ఈ చట్టం చట్టబద్ధత, అవసరంపై తీర్పు ప్రకటించింది. హింసకు పాల్పడేలా రెచ్చగొట్టడం, హింసకు పాల్పడడం వంటి నేరాలను మినహాయంచి, కేవలం ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన ఈ దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని నాటి తీర్పు తప్పుబట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more