జమ్ముకశ్మీర్లోని సాంబా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దుల తాజాగా మరో సొరంగం బయటపడింది. ఇది పాక్కు అత్యంత సమీపంలోనే ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సాంబా సెక్టార్లోని చక్ఫకీరా చెక్పోస్ట్ సరిహద్దు సమీపంలో బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. దీంతో అది ఎక్కడి నుంచి ఉందనే విషయాన్ని గుర్తించడానికి చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అంతర్రాష్ట్రీయ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఈ సొరంగం ఉందని తేలింది. తాజాగా జరిగిన అక్రమ చొరబాట్లు దీనిగుండానే జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు.
భారత భూభాగంలో ఉన్న సొరంగ ముఖద్వారం అంతర్జాతీయ సరిహద్దులో 150 మీటర్ల నుంచి 200 మీటర్ల దూరంలో ఉందని భావిస్తున్నారు. కాగా, అమర్నాథ్ యాత్రను అడ్డుకోవడానికే పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ఏర్పాటు చేసుకున్నారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా సాంబా సెక్టార్ లో బయటపడిన పోరంగంతో.. గడిచిన పదేళ్ల కాలంలో ఇది పదకొండవ సరంగం కాగా ఏడాదిన్నర కాలంలో ఇది ఐదవ సోరంగమని సరిహద్దు భద్రతా ధళాలు స్పష్టం చేస్తున్నాయి. జమ్మూలోని సాంబా సెక్టార్ పాకిస్థాన్ కు అత్యంత సమీపంలో వున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే ఉగ్రవాదులు సొరంగాలను తవ్వి అక్రమచోరబాట్లకు పాల్పడుతున్నారు.
దేశంలోకి అక్రమంగా చోరబడేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మాద్ కు చెందిన ఉగ్రవాదులు ఈ సొరంగా మార్గాన్ని ఎంచుకున్నారని గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల టన్నెల్ను గుర్తించడం సరిహద్దు భద్రతా దళాలకు పెద్ద విజయమని, దేశభద్రత నేపథ్యంలో వారు నిత్యం ఎంతో అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనమని.. ఇలానే ముందుకు సాగుతున్నామని ఇన్స్పెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) జమ్మూ డికె బూరా విలేకరుల సమావేశంలో అన్నారు. సొరంగ మార్గాల అంశంపై పాకిస్థాన్కు తీవ్ర నిరసన తెలియజేస్తామని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2012 నుంచి జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద 11 సొరంగాలను బీఎస్ఎఫ్ గుర్తించిందని చెప్పారు. ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూలో పర్యటించనున్న నేపథ్యంలో సుంజ్వాన్లో దాడి చేసేందుకు ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించారనేది ఊహాగానాలేనని ఆయన అన్నారు. ఈ సొరంగాన్ని సుంజ్వాన్ దాడికి అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే అది కేవలం ఊహాగానాలేనని, ఇంకా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు. సాంబాలోని సొరంగంపై ఇసుక గట్లపై ఎలాంటి గుర్తులు లేవని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more