Two Telugu Students Killed in a U.S. Car Crash అమెరికా రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

Two telugu students killed in a car crash in u s

Southern Illinois University, Carbondale graduate students, Missouri woman, Marie A. Meunier, Cape Girardeau, Pawan Swarna, Vamshi Krishna Pechetty, SIU graduate students, Yaswanth S. Uppalapati, Kalyan Dorna, Kakumanu Karthik, Andhra Pradesh, United States, Crime

According to police reports, two Southern Illinois University-Carbondale graduate students and a Missouri woman died after their vehicles collided on Illinois Route 3 highway in Union County. The reports say that crash happened around 4.15 AM and killed Marie A. Meunier (32) from Cape Girardeau, Missouri, and students Pawan Swarna (23) and Vamshi Krishna Pechetty(23) from Carbondale. They were declared dead at the scene of the accident.

అమెరికా రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

Posted: 04/23/2022 12:35 PM IST
Two telugu students killed in a car crash in u s

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థులు అసువులు బాసారు. తమ కళాశాలలో తరగతులు ముగించుకుని వెళ్తున్న విద్యార్థుల కారును స్థాన్థిక మహిళ కారు వచ్చి ఎదురుగా ఢీకొనింది. దీంతో సదరు మహిళ సహా ఇద్దరు తెలుగు విద్యార్థులు ఘటనాస్థంలోనే మరణించారు. కాగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో తెలుగు విద్యార్థికి పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలోని ఇల్లినాయిస్‌ మూడవ జాతీయ రహదారిపై యూనియన్ కౌంటీలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది.

రెండు కార్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వారు టౌన్‌ కౌంటీ నుంచి ఈస్ట్‌ కేప్‌కు వేగంగా వెళుతున్న సమయంలో మిస్సౌరీలోని కేప్ గిరార్డియూకు చెందిన స్థానిక మహిళ ఫియట్‌ కారు వచ్చి తెలుగు విద్యార్థులు వెళ్తున్న కాను ఢీకొనింది. ఈ ఘటనలో స్థానిక మహిళ అతివేగంగా కారును నడిపిస్తూ అదుపుతప్పి సెంటర్‌ లైన్‌ దాటి పక్కరోడ్డుపైకి దూసుకువెచ్చి తెలుగు విద్యార్థులు వెళ్తున్న టయోటా కారును ఢీకొంది. ఈ ఘటనలో ఫియట్‌ కారు నడుపుతున్న డ్రైవర్‌ మారీ మ్యూనియర్‌ (32) మరణించారు.

అమెతోపాటు తమ కారులో ప్రయాణిస్తున్న వంశీ పెచ్చెట్టి (23), టయోటా కారు నడుపుతున్న పవన్‌ స్వర్ణ (23) అక్కడికక్కడే కన్నుమూశారు. టయోటా కారులో ప్రయాణిస్తున్న యశ్వంత్‌ ఉప్పలపాటి, కాకుమాను కార్తీక్, డోర్న కల్యాణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థులు కాబండేల్‌ టౌన్‌లోని సదరన్‌ ఇలినాయిస్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చేస్తున్నట్లు ఇల్లినాయిస్‌ స్టేట్‌ పోలీసు విభాగం గుర్తించింది. వీరిలో కల్యాణ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతుండగా.. మిగిలిన వాళ్లంతా కంప్యూటర్‌ సైన్స్‌ అభ్యసిస్తున్నారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో అక్కడి పోలీసులు రూట్‌ 3ని కొన్ని గంటల పాటు మూసేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles