ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గతవారంలో గుజరాత్ లోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఏలూరు అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలోని నాలుగో యూనిట్లో జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కిరెడ్డిగూడెం ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలో మంటలు అంతెత్తున్న ఎగసిపడటం.. పోగ వ్యాపించడంతో.. ఏం జరిగిందోనన్న భయాందోళనలో స్థానిక ప్రజలు పరిశ్రమ సమీపానికి చేరుకున్నారు.
పరిశ్రమవర్గాలు మాత్రం పరిశ్రమలో గత రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ లీకైందని.. దీంతో మంటలు వ్యాపించగా పక్కనే వున్న రియాక్టర్ అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయని తెలిపాయి. అయితే రియాక్టర్ పేలుతున్న సమయంలో దాని పరిసర ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కార్మికులలో ఐదుగురు ఘటనాస్థలంలోనే మరణించారు. తీవ్రగాయాలపాలైన 14 మందిని చికిత్స నిమిత్తం అసుపత్రులకు తరలించారు. కాగా వీరిలో ఒక కార్మికుడు మార్గమధ్యలోనే మరణించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పరిశ్రమలోని మిగతా కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అదే సమయంలో పరిశ్రమలో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలకు పైగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనలో మొత్తంగా ఆరుగురు కార్మికులు చనిపోయారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. అయితే చికిత్స పొందుతున్న కార్మికులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యవర్గాలు తెలిపాయని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 18 మంది కార్మికులు ఉన్నారని సమాచారం. ఏలూరులోని అక్కరెడ్డిగూడెం పోరస్ రసాయనాల పరిశ్రమలో ఔషధాల తయారీకి అవసరమైన పొడిని ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రమాద సమయంలో పరిశ్రమలో 18 మంది ఉండగా వారిలో ఇద్దరు కెమిస్టులు, 16మంది కార్మికులని వెల్లడించారు. మృతులలో ఇద్దరు స్థానికులు కాగా, మిగిలినవారు బీహార్కు చెందినవారని తెలిపారు. క్షతగాత్రులలోనూ ఎక్కువగా బీహారీలే ఉన్నారన్నారు. యాజమాన్యంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 13మందిని విజయవాడ ప్రభుత్వాసుప్రతికి తీసుకొచ్చారని అసుపత్రి సూపరింటెండెంట్ సౌభగ్యలక్ష్మి చెప్పారు. ఒక్కరి మినహా మిగిలిన కార్మికులందరూ 70 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నారని, వీరిందరి పరిస్థితి విషమంగానే వుందని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more