తెలంగాణ ప్రభుత్వం తీరు చాలా విచిత్రంగా కనిపిస్తోంది. అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్నట్లు.. దేశంలో కోసం ఆడుతున్న ఓ క్రీడాకారిణిని తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా అప్పట్లో నియమించారు. మరో క్రీడాకారిణి ప్రపంచపోటీలలో సత్తా చాటిందని అత్యంత విలువైన స్థలంతో పాటు నగదు బహుమతులు కూడా ఇచ్చారు. అయితే వారి మాదిరిగానే దేశం కోసమే ఆడుతున్న ఓ క్రీడాకారిణి ఇంటిని మాత్రం కూల్చివేశారు. సికింద్రాబాద్లో మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మహిళా క్రికెటర్ భోగి శ్రావణి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుకారాంగేట్ పరిధిలో గత 35 ఏళ్లుగా క్రికెటర్ భోగి శ్రావణి తన తల్లిదండ్రులతో కలసి నివసిస్తుంది. ఆమె తండ్రి బి. మల్లేష్ ప్లంబర్ గా పనిచేస్తుంటారు. అయితే వారు నివాసముంటున్న ఇంటి వెనుక గోడ ఏక్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఇటీవలే జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు ఇచ్చిన తరువాత తాము తమ ఇంటికి మరమ్మతులు చేశామని చెప్పినా అధికారులు పెడచెవిన పెట్టారు.
క్రితం రోజు సాయంత్రం డెమాలిషన్ స్వాడ్ తో శ్రావణి ఇంటికి చేరుకున్న అధికారులు.. శ్రావణి సహా అమె తల్లిదండ్రులు అధికారులను మరమ్మతులు చేయించామని.. కావాలంటే చూడమని చెప్పినా వినిపించుకోకుండా ఇంట్లోని సామాగ్రిని బయట పడేసిన సిబ్బంది.. వారింటిని కూల్చివేశారు. తమ కళ్లముందే మూడున్నర దశాబ్దాల తమ స్వర్గం చిధ్రం కావడంతో శ్రావణి సహా అమె కుటుంబసభ్యులు తీవ్రంగా బాధపడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు కనీసం తాము చెబుతున్నది ఆలకించకుండా ఇంటిని కూల్చివేయడంపై అమె తీవ్ర అవేధన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే తాము ఇంటికి మరమ్మత్తులు చేసినట్టు తెలిపారు. అదేమీ పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు.. తమ ఇంటికి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, ఈ నెల 15వ తేదీ నుంచి జరిగే మహిళల టీ20 సిరీస్లో పాల్గొనాల్సి ఉందన్న శ్రావణి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ ఆడాలా..? లేక ఇంటి కోసం పోరాడాలా..? అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, శ్రావణి ఇండియా తరఫున మ్యాచ్లను ఆడుతోంది.
కాగా, ఈ ఘటన వెనుక తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కొడుకు రామేశ్వర్ గౌడ్ హస్తం ఉందని శ్రావణి ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీచేసిన తరువాత స్థానిక ఎమ్మెల్యే పద్మారావు తనయుడు రామేశ్వర్ తన తండ్రి కార్యాలయానికి పిలిపించి.. తమను బెదిరించాడని అరోపించారు. రూ. 2 లక్షలు ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని అన్నాడని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం దారుణమని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ ఆడాలో? లేక ఇంటి కోసం పోరాడాలో? అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more