కరోనా పురుడుపోసుకున్న చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ ఉపపరివర్తన ఎక్స్ఈ వేరియంట్ విజృంభిస్తూ.. ఆ దేశంలోని పలు కీలకమైన నగరాలతో పాటు వ్యాపారనగరాల్లోనూ లాక్ డౌన్ కు కారణమైన విషయం తెలిసిందే. కాగా తాజాగా మన దేశంలోనూ ఈ వేరియంట్ ఉనికి బయటపడిందన్న వార్తలు దేశప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే కరోనా మూడు దశల్లో ఏకంగా నాలుగు లక్షల పైచిలుకు మంది ప్రాణాలను ఈ ప్రాణాంతక మహమ్మారి బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక పలువురిలో అరోగ్యపరంగానూ తీవ్ర ప్రభావం చాటింది. ఈ నేపథ్యంలో మరోమారు ప్రాణాంతక ఎక్స్ఈ వేరియంట్ దేశంలోకి ప్రవేశించిందన్న వార్త ప్రజలను కలవరపరుస్తోంది.
ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ గా నామకరణం చేసిన ఈ ఒమిక్రాన్ బి 1ఏ బి2ఏ వేరియంట్ల ఉపపరివర్తనమే ఈ వేరియంట్. కాగా, ఈ వేరియంట్ కు సంబంధించిన తొలి కేసు మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది. ఈ మేరకు మహారాష్ట్ర బ్రిహన్ ముంబై కార్పోరేషన్ అధికారులు తొలుత ప్రకటించిన తరువాత.. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే కూడా ధృవీకరించారు. బ్రిటన్లో జనవరి 19న ఈ వేరియంట్ తొలి కేసు నమోదు కాగా.. తాజాగా భారత్లోనూ బుధవారం ఈ వేరియంట్కు చెందిన తొలి కేసు నమోదైంది.
కరోనా కొత్త వేరియంట్ కేసు నమోదైన నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. మరోసారి రోగి నుంచి సేకరించిన శాంపుల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తరువాత ఇవి ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ తో మ్యాచ్ కావడం లేదని చెప్పింది. అయితే ఇది 2020లో విజృంభించిన కప్పా వేరియంట్ గా పేర్కోంది. ఈ వేరియంట్ ను దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళా నుంచి సేకరించినట్టుగా పేర్కోంది. అమె దేశంలోకి వచ్చినప్పుడు కరోనా టెస్ట్ చేయగా, అమెకు నెగిటివ్ రిపోర్టు వచ్చిందని, కాగా, ఇటీవల అమెను పరీక్షించగా అమెకు పాజిటివ్ రిపోర్టు రావడంతో హోటల్ లో క్వారంటైన్ లో పెట్టామని తెలిపారు. కాగా, కొత్త వేరియంట్పై అధ్యయనం జరుగుతోందన్న కేంద్ర ప్రభుత్వం ఈ వేరియంట్కు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more