భానుడు ఠారెత్తుతున్నాడు. భానుడి భగభగల ధాటికి ఎండలు మండుతున్నాయి. తెలుగు రాస్ట్రాలపై భానుడు కూడా తన ప్రతాపాన్ని చూపుతున్నాడా.. అన్నట్లే ఏకంగా 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో భారత వాతారణ కేంద్ర ఆరెంజ్ ఎలెర్ట్ జారీచేశారు. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలల్లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేశారు.
ఇంట్లోని ఏసీలు ఎంత కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెట్టినా.. కరెంటు దండగే కానీ.. కనీసం చల్లగాలి రావడం లేదంటే ఎండలు ఎంత తీవ్రంగా వున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వేసవి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే సరిస్థితి ఇలావుంటే రోహీణికార్తు సమయానికి పరిస్థితులు ఎలా మారుతాయోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు అందోళన చెందుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నమోదుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ పై కూడా భానుడు తన ఉగ్రరూపాన్ని పద్రర్శిస్తున్నాడు. రాత్రిపూట ఉష్ణోగ్రతల చల్లగా వున్నా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగేఅవకాశాలు ఉన్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2 నంచి 3 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని అంచనా వేసింది. దీనికి తోడు గాలిలో తేమ అధికంగా ఉండటంతో పగటిపూట ఉక్కబోత అధికాంగా ఉండే అవకాశాలు వున్నాయిని తెలిపింది. ప్రజలు అత్యైక పరిస్థుతుల్లోనే తగు చర్యలు తీసుకుని ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక సీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. బలమైన సముద్రపు గాలుల వల్ల కోస్తాంధ్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఎండల తీవ్రత అధికంగా ఉన్నక్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో మంచినీళ్లను తీసుకోవాలని.. గొడుగులను వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు. శీతల పానీయాల కన్నా కొబ్బరిబొండాలు, నిమ్మరసం లాంటివి తీసుకోవడం మంచిదని డైటీషియన్లు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more