హైదరాబాద్లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యంసేవించి వాహనాలను నడపరాదని ఓ వైపు పోలీసులు చెబుతున్నా.. వాటిని పెడచెవిన పెట్టిన మందుబాబులు.. మద్యం మత్తులోనే తమ కార్లను నడుపుకుంటూ అడ్డంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడుతున్నారు. ఇటీవల మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ఓ కారు, రెండు ఆటోలు, రెండు బైకులను ఢీకొట్టిన.. హుందాయ్ క్రెటా కారు వాహనచోదకుడిని అదుపులోకి తీసుకుని పరీక్షించిన పోలీసులు అతడిలో బ్లడ్ ఆల్కహాల్ ఏకంగా 233 పాయింట్ల మేర ఉండటంతో షాకైన విషయం తెలిసిందే. పటాన్ చెరువుకు చెందిన హర్షవర్థన్ రెడ్డిగా అతడ్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిందే.
ఈ ఘటన మర్చిపోకముందే మరోమారు హైదరాబాద్ లోని పాష్ ఏరియా అయిన బంజారాహీల్స్ లో మరో ఘటన జరిగింది. అయితే పోలీసులకు పట్టుబడిన మధ్యం బాబులు.. తాము ఎమ్మెల్యే అనుచరులమంటూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. బంజారాహిల్స్లో డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన కొందరు వ్యక్తులు నానా హంగామా చేశారు. తమను వదిలి పెడతారో.. లేదంటే సస్పెండ్ అవుతారో తేల్చుకోవాలంటూ హెచ్చరించారు. అర్ధరాత్రి రోడ్ నంబరు 2లోని పార్క్ హయత్ హోటల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. దాదాపు 2 గంటల సమయంలో ఓ కారును ఆపి డ్రైవర్కు శ్వాస పరీక్ష నిర్వహించగా బీఏసీ ఏకంగా 151గా నమోదైంది.
అతడిని రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన వ్యాపారి టి.కిరణ్కుమార్రెడ్డి (34)గా గుర్తించారు. వాహనాన్నినిలిపివేశారు. విషయం తెలుసుకున్న అతడి బంధువులైన యెన్నం శ్రీధర్రెడ్డి (47), మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన హనుమంత్రెడ్డి (33), సైదాబాద్కు చెందిన వై.శ్రీకాంత్రెడ్డి, బోడుప్పల్కు చెందిన డ్రైవర్ వి.నరేందర్రెడ్డి (31) అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కారును వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. తాము ఎమ్మెల్యే అనుచరులమంటూ నడిరోడ్డుపై కూర్చోని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారును విడిచిపెట్టకుంటే ఎమ్మెల్యేకు చెప్పి సస్పెండ్ చేయిస్తామంటూ బెదిరించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more