హైదరాబాద్లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. తెల్లవారుజామునుంచే మత్తులో తూగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇప్పటివరకు రాత్రివేళల్లోనే రచ్చ చేసే తాగుబోతులు.. ఇప్పుడు పొద్దుపొద్దున్నే మొదలుపెట్టేస్తున్నారు. దర్జాగా మత్తులో రోడ్లెక్కేసి బీభత్సం సృష్టిస్తున్నారు. వీరి అడగాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ను కట్టడి చేసేందుకు పోలీసులు రాత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీరు రాత్రంతా తాగేసి ఉదయం రోడ్లపైకి వస్తున్నారు. జూబ్లీహిల్స్లో తెల్లవారుజామున కారుతో హల్చల్ చేసిన వ్యక్తిని పరిశీలించగా.. ఏకంగా 233 పాయింట్లు స్కోర్ చేసి పోలీసులకే షాకిచ్చాడు.
ఇప్పుడు.. రోజంతా నిర్వహించాలేమో.. అన్న సందేహం కలిగేలా చేస్తున్నారు. దానికి కారణం.. ఓ మందుబాబు పొద్దున్నే కారుతో హల్చల్ చేశాడు. తీరా అతడికి బ్రీథ్ అనలైజర్ టెస్ట్ చేస్తే.. ఏకంగా డబుల్ సెంచరీ బాది అందరిని అవాక్కయ్యేలా చేశాడు. ఇన్ని రోజులు రాత్రివేళలకే పరిమితమైన మందుబాబుల రచ్చ.. ఉదయం వేళల్లోనూ మొదలైంది. జూబ్లిహిల్స్ చెక్పోస్టు వద్ద ఇవాళ ఉదయం ఓ కారు.. రెండు ఆటోలను ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ను పోలీసులు పరీక్షించి అవాక్కయ్యారు. పొద్దుపొద్దునే ఏకంగా 233 పాయింట్లు చూపించడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో అడుగడుగునా పోలీసులు తనిఖీలు చేస్తున్నా.. మందబాబులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్న పోలీసులు.. మందుబాబుల ఆగడాలు అరికట్టేందుకు నిత్యం శ్రమిస్తున్నారు. పోలీసుల చెక్పాయింట్లను గుర్తించి.. మందుబాబులు తప్పించుకు తిరుగుతుండటంతో.. ఊహించని ప్రాంతాల్లో చెక్పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రత్యేక బృందాలను కేటాయించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. అయినా మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇక నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్లను కట్టడి చేయాలంటే.. తనిఖీలు రోజంతా నిర్వహించాలేమో..? అప్పుడైనా మందుబాబులు రోడ్డెక్కకుండా అదుపులో ఉంటారేమో..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more