ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్న తరుణంలో రెక్కాడితే కానీ డొక్కాడని మధ్యతరగతి ప్రజలు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా అందుబాటులోకి రావడంతో పాటు రాయితీలు కూడా కల్పిస్తుండటంతో ప్రజలు అకర్షితులవుతున్నారు. అయితే ఇలా తెచ్చుకున్న ఈవీ బైకులు.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని కుత్భుల్లాపూర్ పరిధిలో ఓ ఈవీ బైక్ పేలింది. దీంతో ఇంట్లోని సామాగ్రి అంతా కాలిబూడిదైంది.
అయితే ప్రాణనష్టం మాత్రం కాలేదు. కానీ తమిళనాడులో తాజాగా పేలిన ఎలక్ట్రిక్ వాహనం మాత్రం పెను విషాదాన్ని నింపింది. ఇంట్లో ఆదమరచి నిద్రపోతున్న తండ్రి కూతుళ్ల ప్రాణాలను హరించింది. రెండు రోజుల క్రితం ఎంతో ఉత్సాహంగా తెచ్చుకున్న ఎలక్ట్రికల్ బైక్ తండ్రి కూతుళ్ల ఇద్దరి ప్రాణాలను బలిగొందని స్థానికలు కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేలూరు జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె మోహన ప్రీతి (13) పోలూరు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.
ఇదిలా ఉండగా దురై వర్మ రెండు రోజుల క్రితం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి తండ్రీకూతుళ్లు చార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా, ఓవర్ చార్జింగ్ కారణంగా వైరు తగిలి బైక్ పేలిపోయింది.. మరో బైక్కు మంటలు అంటుకున్నాయి. అయితే, పేలుడు ధాటికి భారీగా పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే ఇరుక్కుపోయిన తండ్రీకూతుళ్లు బాత్రూమ్లో దాక్కున్నారు.. అదే వారి ప్రాణాలను తీసింది. బాత్రూమ్లోకి కూడా దట్టమైన పొగలు రావడంతో.. ఊపిరాడక తండ్రీకూతుళ్లు అక్కడే మృతిచెందారు.
ఇక, దురైవర్మ ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. మంటలార్పి లోపలికి వెళ్లిచూస్తే.. అప్పడికే తండ్రీకూతుళ్లు మృతి చెందారు. ఇక, బాత్రూమ్ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మరోవైపు.. కొత్తగా కొనుగోలు చేసిన బ్యాటరీ బైక్ పేలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more