Court adjourned Lord Shiva encroachment case to April 13th భూకబ్జా కేసులో కోర్టుకు రిక్షాలో తరలివెళ్లిన పరమశివుడు..

Strange deeds of officers lord shiva was present but court adjourned case to april 13th

Lord Shiva got illegal possession notice in Raigarh, Notice to Lord Shiva in Raigarh, lord shiva got illegal possession notice in chhattisgarh, Lord Shiva gets notice for illegal possession of land in Raigarh, notice sent to lord Shiva in land dispute in Raigarh, Lord Shiva, illegal possession, Encroachment of government land, revenue officials, Raigarh, chhattisgarh, Crime

You will also be stunned if you are aware of the deeds of Revenue officers in Chhattisgarh's Raigarh district. Lord Shiva Mahadev has been handed a notice by the Revenue officers to remove unlawful occupation and illegal encrochment of government land, from the district's government land. The Lord Shiva attended the court but the court adjourned the case to April 13th.

ITEMVIDEOS: భూకబ్జా కేసులో కోర్టుకు రిక్షాలో తరలివెళ్లిన పరమశివుడు..

Posted: 03/25/2022 09:30 PM IST
Strange deeds of officers lord shiva was present but court adjourned case to april 13th

ప్రభుత్వభూమిని ఆక్రమించారన్న ఆరోపణలపై సాక్షాత్తు పంచ భూతాత్మకకుడైన పరమశివుడికే అధికారులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ పరమశివుడు రాయ్‌గఢ్‌ జిల్లా రెవెన్యూ అధికారులు కోర్టుకు హాజరయ్యాడు. తనపై పెట్టిన అభియోగాలపై ఇవాళ విచారణను ఎదుర్కోనేందుకు సిద్దమయ్యాడు మహాశివుడు. శివుడితోపాటు రాయ్​గఢ్ రెవెన్యూ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న వారందరూ ఇవాళ కోర్టు ఎదుట హాజరయ్యారు. అభియోగాలు ఎదుర్కోంటున్నవారు హాజరయ్యారు సరే.. మరి పరమశివుడు ఎలా హాజరయ్యాడని ప్రశ్న మీలో కలుగుతుందా.? పరమశివుడు రిక్షాలో కోర్టు వద్దకు చేరుకున్నాడు.

ఏంటీ.. పరమశివుడు కోర్టుకు రిక్షాలో వచ్చాడా.? అధికారుల నోటీసులకు మహాశివుడు తలోగ్గి.. ఏకంగా రిక్షాలో రాయ్​గఢ్ తహసీల్ కోర్టుకు హాజరయ్యాడు. అంటే నమ్మశక్యంగా లేదా.? కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఈనెల 25న జరిగే విచారణకు హాజరుకాకపోతే.. ఆ భూమిని బలవంతంగా ఖాళీ చేయించి, రూ.10వేలు జరిమానా విధిస్తామని కూడా జిల్లా రెవెన్యూ అధికారులు పరమశివుడ్ని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేయడంతో ఆయన రాయ్ గడ్ తహసీల్ కోర్టుకు రిక్షాలో చేరుకున్నారు. అక్కడ విచారణకు హాజరయ్యారు. ఈ నోటీసులు అందుకున్న వారందరూ కోర్టు ఎదుట హాజరయ్యారు. విచారణకు హాజరుకాని పక్షంలో రూ.10 వేల జరిమానా విధిస్తామనడంతో కోర్టుకు హాజరయ్యారు.

ఇంత చేసిన తీరా కోర్టుకెళ్లిన తరువాత ఈ కేసు విచారణను ఏకంగా వచ్చే నెల 13కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో ఏలాంటి విచారణ జరగకుండానే శివయ్య తిరుగు పయనం కావాల్సి వచ్చింది. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. రాయ్‌గఢ్ నగరంలోని వార్డు నంబర్ 25లోని కోహ్కుందలో ఒక శివాలయం ఉంది. సుధా రాజ్‌వాడే అనే సామాజిక కార్యకర్తు ఈ శివాలయంపై హైకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు, ఇందులో ఆలయంతో సహా 16 మంది ప్రభుత్వభూమిని కబ్జా చేశారని అభియోగాలు మోపారు. దీంతో న్యాయస్థానం సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. భూకబ్జా అరోపణలపై శివుడితో పాటుగా పదహారు మందికి నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 25న విచారణకు హాజరుకాకపోతే దేవుడితో సహా ప్రతి ఒక్కరినీ 10,000 జరిమానా విధిస్తామని నోటీసులలో పేర్కోంది. అంతేకాదు ప్రాంగణం నుండి బహిష్కరించే అవకాశం ఉందని హెచ్చరించారు. భగవాన్ భోలేనాథ్ ఆస్తిని అతిక్రమించారని అభియోగాలు మోపారు. ఇది విని ప్రజలు అధికారుల తీరుపట్ల విస్తుపోతున్నారు. కాగా ఈ రాష్ట్రంలోశివుడికి నోటీసులివ్వడం ఇది రెండోసారి. జాంజ్‌గిర్-చంపా జిల్లా నీటిపారుదల శాఖ గతంలో నవంబర్-2021లో భోలేనాథ్‌కు నోటీసు జారీ చేసి, ఆస్తిని ఖాళీ చేయాలని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం, తహసీల్దార్ కార్యాలయాన్ని విచారణకు ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం పది మందికి నోటీసులు జారీ చేసింది.

ఆక్రమణదారులకు పంపిన నోటీసులో శివాలయం ప్రతివాది సంఖ్య ఆరుగా పేర్కొనబడింది. నోటీసు నేరుగా శివాలయానికి, అంటే మహాదేవుడికి పంపబడింది. ఆలయ ధర్మకర్త, మేనేజర్ లేదా పూజారిని ఉద్దేశించి పంపకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వభూమిలో ఆలయాన్ని నిర్మించడం చత్తీస్‌గఢ్ ల్యాండ్ రెవెన్యూ కోడ్ కింద నేరం కిందకు వస్తుందని పేర్కొంటూ తహసీల్దార్ కోర్టు.. శివుడికి వార్నింగ్ ఇచ్చింది. పదివేల రూపాయల జరిమానా చెల్లించడంతో పాటు ఆక్రమిత భూమి నుండి ఆలయాన్ని తొలగించాలని తహసీల్దార్ కోర్టు పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles