ప్రచండ భానుడి ఉగ్రరూపానికి నగరవాసులు అప్పుడే బెంబేలెత్తిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు చలికి గజగజ వణికిన నగరవాసి మార్చి నెల తొలివారంలోనే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో హైరానా పడుతున్నారు. ఇక రెండో వారానికి వచ్చేసరికి ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే నగరవాసులు జంకుతున్నారు. గత ఏడాది నగరంలో మార్చి మాసాంతంలోనే ఏకంగా 40 డిగ్రీలకు పైగా గరిష్ణ ఉష్ణోగ్రతలు రికార్డు కాగా, ఈ ఏడాది మార్చి మాసం మధ్యలోనే ఏకంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఇక రానురాను పరిస్థితులు ఎంత తీవ్రంగా వుండబోతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
మే నెలలో భానుడు ఠాయేత్తిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. హైదరాబాద్ మాత్రమే కాకుండా ఏకంగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం ఈ సీజన్ లోనే అత్యధికంగా ఉండబోతుందన్న దానికి సంకేతాలు ఇప్పుడే అందుతున్నాయి. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సాధారణం కంటే 6-7 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి. ఫలితంగా వడగాలులు కూడా మొదలయ్యాయి. రాష్ట్రంలో నేడు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నల్గొండలో సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో నల్గొండలో మార్చిలో నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఇదే. అంతకుముందు 2016లో మార్చి 23న 42 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ తదితర ప్రాంతాల్లోనూ నిన్న 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు మధ్యాహ్నం పూట అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, గాలిలో తేమ తగ్గిపోవడంతో వాతావరణం పొడిగా మారి ఉక్కపోత ఎక్కువైనట్టు పేర్కొన్నారు.
అటు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈసారి వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్చి నెలలో వేసవి ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండడాన్ని వాతావరణ శాఖ గుర్తించింది. మే నెల నాటికి ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కొన్నిప్రాంతాల్లో ఇప్పుడే వడగాలు వీస్తున్నట్టు కూడా తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు అత్యైక పరిస్థితుల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచనలు చేసింది. వడగాల్పులు కూడా వేసవిలో విస్తృతంగా వీచే అవకాశాలు ఉన్నాయని అంచాన వేసింది.
నిన్న అత్యధికంగా గుంటూరు జిల్లా రెంటచింతల, కర్నూలు జిల్లా నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, విజయవాడలో 41 డిగ్రీలకు చేరింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది తుపానుగా ఆరే అవకాశం ఉండడంతో వాతావరణంలోని తేమను ఇది లాగేస్తుందని, తద్వారా రాష్ట్రంలో పొడి వాతావరణం, విపరీతమైన వేడిమి ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు వెళ్లొచ్చని తాజా నివేదికలో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more