Telugu states experiencing high temperatures in March తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తించనున్న భానుడు.. 40 డిగ్రీలు ధాటిన ఉష్ణోగ్రతలు

Telangana andhra pradesh people experiencing high temperatures in the begining of summer

India Meteorological Department, heat wave, weather-report, warning, summer, heatwave in Hyderabad, hear in telangana, Telangana

Telangana, Andhra pradesh are experiancing the more than common temperature this summer. The Indian Meteorological Department (IMD) has said the heat recorded in Greater Hyderabad municipality yesterday was nearly 37 degrees celsius.

‘తెలంగాణలో వడగాల్పుల హెచ్చరిక.. ఏపీలో ఠారెత్తించనున్న భానుడు..

Posted: 03/17/2022 11:23 AM IST
Telangana andhra pradesh people experiencing high temperatures in the begining of summer

ప్రచండ భానుడి ఉగ్రరూపానికి నగరవాసులు అప్పుడే బెంబేలెత్తిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు చలికి గజగజ వణికిన నగరవాసి మార్చి నెల తొలివారంలోనే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో హైరానా పడుతున్నారు. ఇక రెండో వారానికి వచ్చేసరికి ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే నగరవాసులు జంకుతున్నారు. గత ఏడాది నగరంలో మార్చి మాసాంతంలోనే ఏకంగా 40 డిగ్రీలకు పైగా గరిష్ణ ఉష్ణోగ్రతలు రికార్డు కాగా, ఈ ఏడాది మార్చి మాసం మధ్యలోనే ఏకంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఇక రానురాను పరిస్థితులు ఎంత తీవ్రంగా వుండబోతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

మే నెలలో భానుడు ఠాయేత్తిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. హైదరాబాద్ మాత్రమే కాకుండా ఏకంగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం ఈ సీజన్ లోనే అత్యధికంగా ఉండబోతుందన్న దానికి సంకేతాలు ఇప్పుడే అందుతున్నాయి. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సాధారణం కంటే 6-7 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి. ఫలితంగా వడగాలులు కూడా మొదలయ్యాయి. రాష్ట్రంలో నేడు, రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నల్గొండలో సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో నల్గొండలో మార్చిలో నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఇదే. అంతకుముందు 2016లో మార్చి 23న 42 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ తదితర ప్రాంతాల్లోనూ నిన్న 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు మధ్యాహ్నం పూట అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, గాలిలో తేమ తగ్గిపోవడంతో వాతావరణం పొడిగా మారి ఉక్కపోత ఎక్కువైనట్టు పేర్కొన్నారు.

అటు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈసారి వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్చి నెలలో వేసవి ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండడాన్ని వాతావరణ శాఖ గుర్తించింది. మే నెల నాటికి ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కొన్నిప్రాంతాల్లో ఇప్పుడే వడగాలు వీస్తున్నట్టు కూడా తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు అత్యైక పరిస్థితుల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచనలు చేసింది. వడగాల్పులు కూడా వేసవిలో విస్తృతంగా వీచే అవకాశాలు ఉన్నాయని అంచాన వేసింది.

నిన్న అత్యధికంగా గుంటూరు జిల్లా రెంటచింతల, కర్నూలు జిల్లా నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, విజయవాడలో 41 డిగ్రీలకు చేరింది.  ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది తుపానుగా ఆరే అవకాశం ఉండడంతో వాతావరణంలోని తేమను ఇది లాగేస్తుందని, తద్వారా రాష్ట్రంలో పొడి వాతావరణం, విపరీతమైన వేడిమి ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు వెళ్లొచ్చని తాజా నివేదికలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles