రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన అదేశాలను రాష్ట్ర పౌరులందరూ పాటించేలా చూడాల్సిన వ్యవస్థలే కంచె చేను మేసిన చందంగా అదేశాలను తుంగలో కలపాయి. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తెరవాలన్న అదేశాలను రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన వారం రోజలు వ్యవధిలోనే గడ్డి అన్నారం మార్కెట్ నెలమట్టమైంది. పోలీసులు, మార్కెట్ అధికారులు, ప్రభుత్వ వ్యవస్థలు అన్ని మూకుమ్మడిగా ఏకమై హైకోర్టు అదేశాలను కాలరాసాయి. గడ్డి అన్నారం మార్కెటును నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసేలా చేశాయి. గత 160 రోజులుగా వ్యాపారులు చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు గండికొట్టారు.
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తెరవాలంటూ అక్కడి వ్యాపారులు హైకోర్టును అశ్రయించిన నేపథ్యంలో వెంటనే తెరవాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం మార్కెటింగ్ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 4వ తేదీన ఫ్రూట్ మార్కెట్ ను అధికారులు తెరిచిన విషయం తెలిసిందే. ఇంతలోనే మూడు రోజులు గడవక ముందే మార్కెట్ ను కూల్చివేతలు చేపట్టారు. గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. మార్కెట్ మూసివేసేందుకు అధికారులు రావడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తు నడుము మార్కెట్ ను స్వాధీనం చేసుకున్నారు.
మార్కెటింగ్ శాఖ అధికారులు ఫ్రూట్ మార్కెట్ కూల్చివేతలు చేపడుతున్నారని తెలుసుకున్న వ్యాపారులు భారీగా తరలివచ్చారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఉదయం 4 గంటల నుండి కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు తెల్లవారేసరికి ఫ్రూట్ మార్కెట్టును నేలమట్టం చేశారు. చరిత్రలో.. నగరానికే తలమానికంగా నిలిచిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ చరిత్ర లో కలిసి పోయింది. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రజల కోసం 18 ఎకరాల విస్తీర్ణంలో గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు.
అప్పటి నుంచి రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఇక్కడే తమ వ్యాపారులు కొనసాగిస్తున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు ఫ్రూట్ మార్కెట్ ను ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తూ వస్తుంది. 2020 లో మార్కెట్ ను కోహెడకు తరలించింది. అక్కడ ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా వేసిన షెడ్లు నేల కూలాయి. దీంతో తిరిగి ఫ్రూట్ మార్కెట్ ను గడ్డి అన్నారం కి తరలించారు. ఇక గత ఏడాది ఏప్రిల్ నెలలో గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ ను కోహెడకు తరలించి ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని రాష్ట్ర మంత్రులు నిర్ణయించారు.
అప్పటి నుంచి మార్కెట్ ను తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూ.. చివరికి మార్కెట్ ను పూర్తిగా మూసివేశారు. దీంతో వ్యాపారులు తమకు కోహెడలో పూర్తి సౌకర్యాలు కల్పించకుండా తరలిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. చివరికి హైకోర్టు ఫ్రూట్ మార్కెట్ ను తెరువాలంటూ వ్యాపారులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. హై కోర్టు ఉత్తర్వులతో ఈ నెల 4న మార్కెట్ ను తెరిచిన అధికారులు మూడు రోజులు తిరగకుండానే హై కోర్టు ఉత్తర్వులని లెక్క చేయకుండా రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more