ఎవరికైనా అన్యాయం జరిగితే.. బెదిరింపులు వస్తే.. ప్రాణభయం ఏర్పడినా.. అన్యాయానికి గురైనా ఠక్కున పోలీసు స్టేషన్ కు వెళ్లి అవతలివారిపై పిర్యాదు చేస్తాం. కేసును దర్యాప్తు చేసిన తరువాత తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా ప్రజలకు పోలీసులపై ఉంది. అయితే కొందరు గతంలో పోలీసులపై ఉన్న అభిప్రాయాలతోనో.. లేక అక్కడికి వెళ్లితే.. తామే పలుమార్లు తిరిగాల్సి వస్తుందన్న అభద్రతా భావంతోనో కొందరు పోలిసు స్టేషన్ కు వెళ్లేందుకు సుముఖత చూపరు. కానీ.. ఈ మధ్య కొందరు చిన్నారులు ఎలాంటి జంకు లేకుండా ఠాణాలకు వెళ్తున్నారు.
భయం పక్కనపారేసి.. తమకొచ్చిన బాధలు చెప్పుకుని న్యాయం చేయాలని ధైర్యంగా పోలీసులను అడుగుతున్నారు. ఇదివరకే ఇద్దరు చిన్నారి స్నేహితుల మధ్య గొడవ తలెత్తడంతో ఒక చిన్నారి నేరుగా ఠాణాకు వెళ్లి అతడి స్నేహితుడిపై పిర్యాదు చేసిన ఘటనను మర్చిపోకముందే.. ఇలాంటి ఘటనే మరోకటి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న అనిల్కు ఓ బాధొచ్చింది. తనను ఓ ఉపాధ్యాయుడు తరచూ కొడుతున్నాడు.
అయితే.. ఎలాంటి తప్పు లేకుండానే ఆ ఉపాధ్యాయుడు తనను కొడుతుండటాన్ని ఆ చిన్నారి తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులకు చెప్పినా.. ఫలితం కనిపించలేదు. తనకు పోలీసులైతేనే న్యాయం చేస్తారని ఆ చిన్నారి నిర్ధరించుకున్నాడు. వెంటనే తన తండ్రిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. నేరుగా ఎస్సై రమాదేవి దగ్గరికి వెళ్లి తన బాధ మొత్తం వెల్లగక్కాడు. తనను కొట్టే సారును అరెస్ట్ చేయాలని పట్టుబట్టాడు. పిల్లాడు చెప్పే ముచ్చట మొత్తం విన్న ఎస్సై.. కానిస్టేబుల్ను పురమాయించారు. పాఠశాలకు వెళ్లి ఆ సారు ఎవరు..? అసలు సంగతేంటో కనుక్కొమ్మని పంపించారు.
స్కూల్కు వెళ్లిన కానిస్టేబుల్.. పాఠశాల మాస్టార్లను పిలిపించగా.. వారిముందే ఎలాంటి భయం లేకుండా.. "ఈ సారే నన్ను కొట్టింది. ఆ సారును అరెస్ట్ చేయండి.." అని చెప్పాడు. ఈ ఒక్కసారికి వదిలేద్దాం.. మళ్లీ ఎప్పుడూ కొట్టకుండా చెప్తామని ఎంత బుజ్జగించినా.. తగ్గేదేలే.. కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. అనిల్ ముందే సార్లకు కానిస్టేబుల్ గట్టిగా చెప్పి.. ఇటు ఆ చిన్నారికి కూడా నచ్చజెప్పటంతో.. పంచాయితీ తెగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఆ చిన్నారి ధైర్యానికి మెచ్చుకుంటూనే.. ఇంత చిన్నవయసులో ఇంత తెగింపేంటని ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more