భారత్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కరోనా ఆంక్షలు కూడా ఎత్తివేశారు. ప్రజలు కూడా కరోనా మార్గదర్శకాలను కూడా పక్కనబెట్టి మరీ సంచరిస్తున్నారు. అయితే కరోనా దశకు దశకు మధ్య ఇలా ప్రజలు తిరగడం పరిపాటిగా మారింది. దీంతోనే రెండో దశలో దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా చుట్టుముట్టి అనేక మందిని పోట్టనబెట్టుకుంది. కాగా ఆ తరువాత వచ్చిన మూడవ దశ ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు అంత తీవ్రంగా లేకపోవడంతో దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ తరువాత వచ్చే కరోనా నాల్గవ దశ అయితే అత్యంత తీవ్రమైనది అయ్యివుండాలి లేదా.. నామమాత్రపు లక్షణాలతో కూడినదై వుంటుందని ఇప్పటికే వైద్యనిపుణులు అంచనా వేసిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని పక్కనబెడితే అసలు దేశంలో కరోనా వైరస్ నాలుగో దశ ఎప్పుడన్న విషయాన్ని ఐఐటీ కాన్పూర్ అంచనా వేసింది. కాన్పూర్ ఐఐటీ చేసిన పరిశోధనలో కరోనా వైరస్ కు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన దేశంలో కరోనా నాలుగో వేవ్ త్వరలోనే రాబోతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. రాబోయే జూన్ 22 పరిసర ప్రాంతంలో భారత్లో కరోనా నాలుగో వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఆగస్టు చివరి నాటికి ఇది పీక్ స్థాయికి చేరుతుందని ఈ స్టడీ వెల్లడించింది. అయితే ఏదైనా కొత్త కరోనా వేరియంట్ బయటపడితే ఈ అంచనాలు మారే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
కొత్తగా వచ్చే వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది? ఎంత ప్రమాదకరం? అనే అంశాలు ఈ పరిశోధనను ప్రభావితం చేస్తాయని వారు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తర్వాత జనవరిలో కరోనా తీవ్రత పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రతిరోజూ దేశంలో లక్షపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పరిస్థితి నెమ్మదిగా తగ్గుముఖం పట్టుంది. ఇప్పుడు 20 రోజుల నుంచి లక్షలోపు కేసులే నమోదవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య 20 వేల లోపే ఉంటోంది. అయితే అప్పుడే కరోనా పూర్తిగా అంతం కాలేదని, జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more