కాంగ్రెస్లో రెండు భిన్న ధ్రువాలుగా పేరున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.., ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని మంగళవారం కలిశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ అయ్యాక మొదటిసారి కోమటిరెడ్డిని రేవంత్రెడ్డి కలిశారు. ఇద్దరూ కలిసి సీఎం కేసీఆర్నే టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. అయితే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను రేవంత్రెడ్డి తన ట్విట్టర్లో షేర్ చేశారు. దానికి హ్యాపీ టైమ్స్ అని కామెంట్ జత చేశారు. ఇక ఇద్దరు లీడర్లు ఒకే ఫ్రేమ్లోకనిపించడంతో అటు పార్టీలో, ఇటు రాజకీయపరంగా చర్చనీయాంశంగా మారింది.
కోమటిరెడ్డిని కలిసినన అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబం దొంగ రాజీనామాలు చేసిందని దుయ్యబట్టారు.. అస్సాం సీఎంపై ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదన్న రేవంత్రెడ్డి.. రేపు ఎస్పీ, కమిషనరేట్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి కోవర్టు అని ఆరోపించారు. ఈ కోవర్టు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్టు నటించి, యూపీఏ భాగస్వామ్య పక్షాలకు దగ్గరై వాళ్ల మధ్యన చిచ్చు పెడతాడని వివరించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చి, మోదీ పీఠాన్ని పదిలం చేయడానికి ప్రయత్నిస్తాడని అన్నారు.
మోదీకి అనుకూలంగా పనిచేయడానికి ఈ కోవర్టు గ్యాంగ్ సుపారీ తీసుకుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.మోదీ కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పటికీ కలబోవని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ‘కర్షకుల కోసం కాంగ్రెస్’ అంటూ కాంగ్రెస్ వరి దీక్షలకు దిగింది. రైతుల సమస్యలపై ఇందిరాపార్క్లో జరిగిన దీక్షలో రేవంత్.. కోమటిరెడ్డికి తోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకే వేదికపై కనిపించారు. దీంతో పార్టీ కేడర్లో ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసిపోవడంతో క కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నిండిందనే చెప్పవచ్చు. ఎప్పటి నుంచో కొంత అస్పష్టతతో ఉన్న కార్యకర్తల్లోని అనుమానాన్ని ఈ రోజు వరి దీక్ష వేదిక నుంచి కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు తరిమికొట్టారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more