అడవిలో వెళ్తెున్న సమయంలో పెద్దపులి ఎదురైతే.. ఏం చేస్తారు.? అమ్మో అంటూ గుండెలు పట్టుకుంటారు. వెంటనే దాని బారిన పడకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే పులి దాడి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఇటీవల ఓ కర్ణాటకవాసి చేసిన పోరాటం గురించి విన్నాం. ఇక ఆ తరువాత ఓ తల్లి తన బిడ్డను పులి నుంచి రక్షించుకునే పోరాటాన్ని కూడా విన్నాం. కానీ పులి అనగానే దుర్గమ్మవారి వాహనమనే కోందరితో పాటు.. పులిని చూని భయపడే కొందరు దాని నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాల్లో చెట్టు ఎక్కడం ఒక్కటి.
ఇక్కడ కూడా ఓ ఇద్దరు యువకులు పులిని చూడగానే చటుక్కున చెట్టు ఎక్కేశారు. అంతకుముందు వారికి అలా చెట్టు ఎక్కే అలవాటు ఉందో లేదో తెలియదు కానీ.. పులిని చూడగానే వారికి భయంతో చెట్టు ఏక్కేయడం వచ్చేసింది. ఇందులో వింత ఏముంది అంటారా.. వారిద్దరూ పులి నుంచి తప్పించుకునేందుకు ఏకంగా గంటకు పైగానే చెట్టుపై గడిపారు. తమ పంచ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని చెట్టుపైనే వున్నారు. ఇక పులి తమ సమీపం నుంచి నిష్క్రమించిందని తెలిసిన తరువాత యువకులు జాగ్రత్తగా చెట్టు దిగి వెళ్లారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ లోని పన్నాలోపల ఉన్న ఝలారియా మహాదేవ్ ఆలయం ఏడాదికి ఓ పర్యాయం మాత్రమే భక్తుల సందర్భనార్థం తెరుస్తారు. మిగతా సమయాల్లో ఆలయంలో కేవలం పూజారులు మినహా భక్తులకు అనుమతి లభించదు. దీంతో ఇటీవల తెరచిన ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పలువురు వాహనాల్లో వెళ్లారు. అయితే ఇద్దరు యువకులు మాత్రం బైక్ పై బయలుదేరారు. మార్గమధ్యంలో వారికి పెద్దపులి కనిపించింది. దీంతో అప్రమత్తమైనవారు ప్రాణభయంతో బైక్ అక్కడే వదిలేసి చెటుకున్న చెట్టు ఎక్కారు. కార్లలో గుడికి వెళ్తున్నవారు కూడా పులి రోడ్డుపైనే సేద తీరడంతో వేచివున్నారు. ఆ తరువాత చెట్టు ఎక్కిన ఇద్దరి దృశ్యాలను తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more