Telangana RTC modified diesel bus into 100 percent electric bus కొత్త ఈవీ బస్సుపై అథ్యయనం చేయనున్న టీఎస్ఆర్టీసీ

Telangana rtc experimental study on modification of diesel bus into electrical bus

fuel cost cutoff, increasing fuel prices, increasing diesel Price, losses, Profit, Telangana State Road Transport Corperation, TSRTC, Experimental Study on modified EV Bus, smooth run modified EV Bus, modified EV Bus passengers capacity, modified EV Bus traffic hurdles, Modification of Diesel bus, modified 100 percent Electrical Bus, modified EV Bus, Mushirabad Depot, Hyderabad, Telangana

To cutoff the increasing of the cost of fuel (diesel) prices and to overcome the losses facing by the Telangana Road Transport Corperation (RTC) had initiated to Experimental Study on the smooth run, passengers capacity, traffic hurdles with the Modification of Diesel bus into 100 percent Electrical Bus

కొత్త ఈవీ బస్సుపై అథ్యయనం చేయనున్న టీఎస్ఆర్టీసీ

Posted: 02/12/2022 04:51 PM IST
Telangana rtc experimental study on modification of diesel bus into electrical bus

తెలంగాణ ఆర్టీసీలోకి మరో కొత్త ఎలక్ట్రిక్‌ బస్సు వచ్చింది. ఇంతకుముందుగానే ఎలక్ట్రిక్ బస్సులు వున్నాయిగా.. ఈ బస్సులో ఏమీటీ ప్రత్యేకత అంటారా.. అయితే ఇది కొత్త ఎలక్ట్రిక్ బస్సే కానీ.. అంతకుముందు సిటీరోడ్లపై డీజిల్ ఇంధనంతో పరుగులు పెట్టిన బస్సు కావడం గమనార్హం. దీనిని డీజిల్ ఇంధనం నుంచి నూటికి నూరుపాళ్లు ఎలక్ట్రిక్ బస్సుగా మార్చేశారు. డీజిల్‌ భారం నుంచి బయటపడేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయోగంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ బస్సు అంతకుముందు డీజిల్‌తో నడిచినా.. తాజాగా మాత్రం ఎలక్ట్రిక్‌ బస్సుగా మారింది.

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ డిపోకు చేందిన ఈ బస్సు కొత్త ఇంధనం రూపురేకలతో శుక్రవారం సాయంత్రం తిరిగి ఢిపోకు చేరుకుంది. అయితే సిటీ రోడ్లపై పరుగులు తీయాల్సిన ఈ బస్సు ఎంత మేరకు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్ని అన్న కోణంలో దీనిపై అధ్యయనం చేయనున్నారు. ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది, డీజిల్‌తో పోలిస్తే ఎంత ఆదా చేస్తుంది, నిర్వహణ వ్యయం ఎంత తగ్గుతుంది, ట్రాఫిక్‌ రద్దీలో ఎలా నడుస్తుందన్న అంశాలను బేరీజు వేసుకుని మరిన్ని బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నగరంలో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తున్నాయి. అయితే అవి కేవలం విమానాశ్రయానికి వచ్చిపోయే వారికే సేవలందిస్తున్నాయి.

వాటికి భిన్నంగా ఈ బస్సు సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది. జీతాల తర్వాత అంత భారీ వ్యయం డీజిల్‌ కోసం అవుతోంది. ఒక్కో బస్సుకు కి.మీ.కు రూ.20 వరకు ఖర్చు అవుతోంది. జీతాలను తగ్గించుకోవటం సాధ్యం కాదు. కానీ డీజిల్‌ ఖర్చును తగ్గించుకునే వెసులుబాటు ఉండటంతో ఆర్టీసీ ఆ దిశగా యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్‌ బస్సుల వైపు మొగ్గు చూపింది. ఎలక్ట్రిక్‌ బస్సుకు కి.మీ.కు కేవలం రూ.6 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే డీజిల్‌ బస్సుతో పోల్చితే ప్రతి కి.మీ.పై రూ.14కు పైగా మిగులుతుందన్నమాట. కానీ ఒక్కో కొత్త ఎలక్ట్రిక్‌ బస్సు ధర రూ.కోటిన్నర పైమాటే.

అంత వ్యయంతో ఎలక్ట్రిక్‌ బస్సులు కొనే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే ఉన్న డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్పిడి (కన్వర్షన్‌) చేసేందుకు ఉన్న అవకాశాన్ని సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ఇందుకు ఒక్కో బస్సుకు రూ.65 లక్షల వరకు మాత్రమే ఖర్చవుతుండటం కూడా ఆర్టీసీని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ కేంద్రంగా ఎలక్ట్రిక్‌ రైలు లోకోమోటివ్‌లు తయారు చేసే ఓ సంస్థను సంప్రదించింది. ఆ సంస్థ అంగీకరించడంతో ముషీరాబాద్‌–2 డిపోకు చెందిన ఓ డీజిల్‌ బస్సును ఇవ్వగా దాన్ని ఎలక్ట్రిక్‌ బస్సుగా కన్వర్ట్‌ చేసిన సదరు సంస్థ శుక్రవారం ఆర్టీసీకి అప్పగించింది. దీంతో దాని పనితీరును నెల రోజుల పాటు పరిశీలించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : diesel Price  RTC losses  TSRTC  Experimental Study  modified EV Bus  Mushirabad Depot  Hyderabad  Telangana  

Other Articles