కరోనా మూడో దశ దేశంలో తన ఉద్దృతిని క్రమంగా కొల్పోతుంది. అయితే అది సృష్టించిన భీభత్సంతో తొలిదశ, రెండవ దశలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. దేశంలో రోడ్ల పక్కన, నదుల్లోనూ కోవిడ్ మృతదేహాలే కనిపించి అల్లకల్లోలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో కరోనా వాక్సీన్ రావడంతో ప్రజలకు కాసింత ధైర్యం కూడగట్టుకున్నారు. కరోనాకు పలు దేశాలు పలు రకాల టీకాలను కనుగోన్నారు. అయితే టీకాల ప్రభావం కేవలం ఆరుమాసాలేనని, తరువాత యాంటీబాడీలు తగ్గుముఖం పడుతున్నాయన్న వార్తలు వచ్చాయి. అయినా టీకాలు తీసుకుని కరోనా నుంచి రక్షణ పోందాలని వైద్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా వాక్సీన్ తీసుకోవాలని ఎంతమంది వైద్యులు చెబుతున్నా సూది మందుకు జంకుతున్న పలువురు దేశ ప్రజలు మాత్రం అటువైపు అడుగుకూడా వేయడం లేదు. ఇక కరోనా వచ్చిన రోగులకు కూడా రెమిడిసివిర్ మందు ఇంజక్షన్ రూపంలోనే అందుబాటులో వుంది. అయితే సూది భయం ఉన్నవారి కోసం విధానం అందుబాటులోకి వచ్చింది. పరిశోధన ద్వారా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలో ముందుండే గ్లెన్ మార్క్ ఫార్మా.. కరోనా చికిత్స కోసం సరికొత్త ఔషధాన్ని ఆవిష్కరించింది. ఫాబిఫ్లూ (ఫావిపిరావిర్) ఔషధాన్ని సైతం ఈ సంస్థ అన్ని కంపెనీల కంటే ముందుగా రోగులకు అందుబాటులోకి తీసుకురావడం తెలిసిందే. తాజాగా ‘ఫ్యాబి స్ప్రే’ పేరుతో నాసల్ స్ప్రేను విడుదల చేసింది. ఇందుకు భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం పొందింది.
ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. కరోనా వైరస్ లోడ్ ను తగ్గించడంలో మంచి ఫలితాలను ఇస్తున్నట్టు గ్లెన్ మార్క్ ఫార్మా చెబుతోంది. ‘‘ఫేస్ 3 పరీక్షల్లో వైరల్ లోడ్ ను 24 గంటలలో 94 శాతం మేర, 48 గంటలలో 99 శాతం మేర తగ్గిస్తున్నట్టు తేలింది. నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే సురక్షితమైనది’’ అని సంస్థ ప్రకటన విడుదల చేసింది. ముక్కులో స్ప్రేను కొట్టుకుంటే శ్వాస వ్యవస్థలోకి వెళ్లకుండా వైరస్ ను అడ్డుకుంటుందని గ్లెన్ మార్క్ అంటోంది. ‘‘శ్వాసకోస వ్యవస్థ ఎగువ భాగంలోనే వైరస్ ను చంపేసే లక్ష్యంతో ఫ్యాబి స్ప్రేను అభివృద్ది చేయడం జరిగింది. దీనికి యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఉన్నట్టు రుజువైంది. కరోనా వైరస్ మరిన్ని వైరస్ కణాలను ఉత్పత్తి చేసుకోకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది’’ అని గ్లెన్ మార్క్ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more