పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సీంగ్ చన్ని మేనల్లుడు భూపేందర్ సింగ్ అరెస్ట్ కావడం పట్ల రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అక్రమ ఇసుక రవాణ వ్యవహారంలో ఆయనను గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించిన ఈడీ అధికారులు సాయంత్రం పొద్దుపోయిన తరువాత అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలపై బురదజల్లేందుకు కేంద్రం ఒత్తిడి మేరకు ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ ఈ చర్యలకు పాల్పడిందన్న అరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి, పంజాబ్ ముఖ్యమంత్రి మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీని ఈడీ అరెస్ట్ చేసింది.
సుమారు ఎనిమిది గంటల పాటు భూపీందర్ను విచారించిన ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అరెస్టు చేశారు. గత నెలలో ఈడీ అధికారులు పంజాబ్లోని మొహాలీ, లూథియానా, రూప్నగర్, ఫతేఘర్ సాహిబ్, పఠాన్కోట్లో భూపీందర్ సింగ్తో పాటు పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇసుక మైనింగ్ వ్యాపారం, ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు, రూ. 21 లక్షల విలువైన బంగారం, రూ.12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్తో పాటు రూ.10 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఒకే దశలో ఫిబ్రవరి 20న జరగనుండగా.. మార్చి 10న ఫలితాలు వెలువడి కానున్నాయి.
#WATCH | Punjab CM Charanjit Singh Channi's nephew Bhupinder Singh Honey arrested by Enforcement Directorate (ED) from Jalandhar on Thursday evening following day-long questioning in an illegal sand mining case: Sources pic.twitter.com/6ciwmY1mhX
— ANI (@ANI) February 4, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more