ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ వేళ.. గుడివాడలోని రాష్ట్ర మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ హాలులో క్యాసినో నిర్వహించారన్న వార్తలతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ నేతలు నిజనిర్థారణ కమిటీతో సదరు ప్రాంతంలో పర్యటించేందుకు రాగా, ఇక తాజాగా బీజేపి నేతలు గుడివాడ ప్రాంతంలో పర్యటించి సత్యాన్వేషణ చేసేందుకు బయలుదేరారు. కేసినో నిర్వహించడం, అమ్మాయిలతో అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడం వంటి ఘటనలను నిరసిస్తూ బీజేపీ నేతలు విజయవాడ నుంచి గుడివాడకు పాదయాత్రగా బయల్దేరారు. బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు నేతృత్వంలో బీజేపి నేతలు సత్యాన్వేషణకు బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
నందమూరు వద్ద వారిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే సోము వీర్రాజు సహా రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తదితర నేతలను కృష్ణా జిల్లా పోలీసులు నందమూరు వద్ద అడ్డుకోగా, వారు వాహనాలు దిగి కాలినడకన గుడివాడకు బయలుదేరారు. పోలీసుల వలయాన్ని చేధించుకుని బీజేపి నేతలు ఏకంగా మూడు కిలోమీటర్ల దూరం నడిచారు, కాగా, బీజేపీ నేతలను పోలీసులు కలవపాముల వద్ద మరోసారి అడ్డుకున్నారు. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేతలను అడ్డుకునేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపి ఉంగుటూరుకు తరలించారు.
దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో శాంతిభద్రతలను కారణంగా చూపుతూ తమను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు తమను అడ్డుకోవడమేంటని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ అరెస్టులను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఇతర నేతలు సంక్రాంతి వేడుకల కోసం గుడివాడకు వెళ్తుండగా వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని జీవీఎల్ అన్నారు. రాష్ట్రంలోని కొందరు ఐపీఎస్ అధికారులు వైపీఎస్ (వైసీపీ పోలీస్ సర్వీస్) అధికారుల మాదిరి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more