వర్షం పడుతున్న సమయంలో ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే మనం ఒకటి రెండు సార్లు అలోచిస్తాం. ఎందుకంటే ప్రతీ రోజు వెళ్లే రోడ్డే అయినా.. ఎక్కడ గొతులు పడ్డాయో.. ఎక్కడ నీళ్ల కింద గోతులు వున్నాయో తెలియక ప్రమాదాల బారిన పతడామో అన్ని ఆందోళన కూడా కారణం కావచ్చు. అయితే వర్షం బదులుగా మంచు తుఫాను కురిసే ప్రాంతాల్లో పరిస్థితి ఏలా ఉంటుందో.. ఎందుకంటే కనీసం నీళ్లు ప్రవాహం, సుడులు తిరగడంతో కాస్తా కూస్తో రోడ్డును అంచనా వేసుకుంటూ వెళ్లవచ్చు. కానీ మంచు తుపాను పడితే మంచు కింద గోయ్యి వుందో రోడ్డు వుందో కూడా తెలియదు. మంచు తుఫాను సమయంలో బయటికి వెళ్లాలనే ఆలోచన చాలా మందిని భయపెడుతుంది.
కానీ కెనడాలో ఒక వ్యక్తి మాత్రం మంచు తుపాను కురుస్తున్నా.. లెక్కచేయకుండా బయటకు వెళ్లాడు. అతని అలాంటి కష్టం వచ్చింది. మంచు తుపాను కూడా లెక్కచేయలేని అంత కష్టం ఏమిటా అంటే.. భరించలేని క్షుద్భాదే. ఆకలితో నకనకలాడుతున్న కడుపును కాస్తా కష్టమైనా నింపుకోవాలని భావించాడు. వరసగా గత వారం నుంచి కురుస్తున్న మంచుతుపానుతో ఇంట్లోని సరుకులు నిండుకున్నాయో.. లేక మరేంటో కారణం తెలియాదు కానీ.. ఇంట్లో వంట చేసుకోలేక.. తనకు ఇష్టమైన రెస్టారెంట్కు వెళ్లడానికి పెద్ద సాహసయాత్రనే చేపట్టాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరోటి తలచిందన్నట్లు.. అతడు చేసిన సాహనంతో నెటిజనులకు చేరువయ్యాడు. మంచుతుపానులో నడివడంతోనే అతని వీడియో వైరల్ అయ్యిందా.. అని ప్రశ్నిస్తున్నారు కదూ.
కాదండీ.. ఎంతో ఆకలి వేయడంతో అతను స్థానికంగా వుంటే రెస్టారెంటుకు చేరుకున్నాడు. మంచు తుపానులో అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి.. ఇక ఆకలి బాధనైనా తీర్చుకుందామనుకుని రాగా, రెస్టారెంట్ మూసివేసి ఉంది. దీంతో ఇంత సాహసం చేసి వచ్చినా.. దేవుడు తనకు అకలి బాధను మాత్రం తీర్చే మార్గాన్ని చూపించలేదన్నట్లు.. రెస్టారెంట్ కు తాళం వేసివుండటం చూసి గుండె పగిలినంత పనైంది. దీంతో ఒక్కసారిగా తన మోకాళ్లపై కూలబడిపోయాడు. ఇక చేసేది లేక కొద్ది సేపటికి లేచి తన ఆకలి బాధ ఎలా తీరేనో అనుకుంటూ వెనుదిరిగాడు. ఈ క్రమంలో అతడు నిరాశకు గురై తిరుగివెళ్తున్న క్రమంలో తనను తాను బాల్సెన్స్ చేసుకోవడం కూడా కష్టంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ నెట్టంట్ల వైరల్ అయ్యింది.
ఈ వీడియోను పరిశీలించిన రెస్టారెంట్ యాజమాన్యం.. ఈ ఫూటేజీని నెట్టింట్లో అప్ లోడ్ చేసింది. అంతేకాదు నిరాశగా వెనుదిరిగి వెళ్లిన కస్లమర్ కు రెస్టారెంట్ ఉచిత భోజనం ఇవ్వాలని నిర్ణయించింది. మంచు తుపాను కారణంగా ఫుడ్ డెలివరీ సేవలు గంటల తరబడి మూసివేయబడినందున, స్కార్బరోలో ఆకలితో ఉన్న కస్టమర్ ఏదో విధంగా మంచుతో కూడిన వీధిలోంచి నైసీస్ తినుబండారానికి వెళ్లాడు. కరేబియన్ రెస్టారెంట్ షేర్ చేసిన సిసీటీవీ ఫుటేజీలో.. రెస్టారెంట్ వద్దకు చేరుకున్న కస్టమర్.. అది మూతవేయడం చూసి నిరుత్సాహానికి గురైన వ్యక్తి మోకాళ్లపై పడిపోయాడు. దీంతో అతని ఆకలి బాధను అర్థం చేసుకున్న నెటిజనుల నుంచి సానుభూతి విపరీతంగా వ్యక్తమైంది.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more